పాలమూరు, మార్చి 30 : కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి గెలుపునకు కృషి చేయాలని ఆయన కోరారు. మహబూబ్నగర్ రూరల్ మండలం ఫత్తేపూర్లో శనివారం నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠాపనోత్సవాల్లో శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె, గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు చాలా గొప్పవన్నారు.
వీటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. తమ హయాంలోనే ఫత్తేపూర్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. అనంతరం ఎంపీ మన్నె మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఓటు వేశారని, హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, ఫత్తేపూర్ ఎంపీటీసీ కృష్ణయ్య, మాజీ సర్పంచ్ గౌడ్, సీనియర్ నాయకుడు రాఘవేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.