భూత్పూర్/నవాబ్పేట, ఏప్రిల్ 14 : ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే వారితో అప్రమత్తంగా ఉండి, గత ఎన్నికల్లో చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠాలను నేర్చుకొని మేల్కోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు అప్రమత్తం కాకపోతే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్ర మాదం ఉందని స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో భూత్పూర్లోని కేఎమ్మార్ ఫంక్షన్హాల్లో.., మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్యర్యంలో నవాబ్పేట మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ నేత లు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించా రు. సమావేశానికి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎ మ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి డిసెంబర్ 9న రైతుల ఖాతాల్లో రూ.15వేలు రైతుబంధు వేస్తామని చెప్పారన్నారు. కల్యాణలక్ష్మి పథకంతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చినా వా టి ఊసే ఎత్తడం లేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే హామీలన్నీ తుంగలో తొక్కడం ఖాయమన్నారు.
అందుకే అందరూ ఆలోచించి పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత అ సెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాట్లతో పల్లెలన్నీ వల్లకాడుగా మారుతున్నాయని, అంతులేని ముప్పు వాటిల్లబోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హ యాంలో గ్రామాలు, పట్టణాల్లో ఊహించని పనులు చేశామని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో క్షణికావేశంలో, పార్టీలో కొంత సఖ్యత లేక పొరపాట్లు చేశారని, వచ్చే ఎన్నికల్లో అలాంటి తప్పులు దొర్లవద్దని కోరారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ప్రజలు జీవితంలో ఎప్పుడూ పడని కష్టాలు పడుతున్నారని ఆరోపించారు. తాగునీరు దొరకక వాటర్ ట్యాంకులు దర్శనమిస్తున్నాయని తెలిపారు. వరి చేలు ఎండిపోయాయని, కరెంట్ కాటగలిసిందని, రైతుబీమా, రైతుబంధు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేద్దామని మనమంతా ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రజలంతా అప్రమత్తమై స్థానికుడైన మన్నె శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీతో రెండోసారి ఎంపీగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అతివిశ్వాసంతోనే గత ఎన్నికల్లో ఓటమి చవిచూశామని, మళ్లీ అలాంటి పరిస్థితులు రానివ్వొద్దని సూచించారు. ప్రజలను మో సం చేయడం కాంగ్రెస్కు మొ దటి నుంచి అలవాటేనని, ప్రజలు అడుక్కుతినాలనే కోరుకుంటుంద ని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం గత పదేండ్లల్లో ధరలను పెంచడమే ధ్యేయంగా పెట్టుకున్నదని, ప్రజలకు చేసింది మాత్రం శూన్యమేనని ఆరోపించారు.
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని, అలాంటి రాష్ర్టాన్ని పరుల చేతుల్లో పెట్టడం చాలా బాధ గా ఉందన్నారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. కేసీఆర్ సర్కారు 90 శాతం పూర్తి చేసిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మూలన పడే సే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాల్వ పనులకు టెండర్ పూర్తైనా రద్దు చేయడం దారుణమన్నారు. అమలు కాని హామీలతో గెలిచి వాటిని పట్టించుకోకుం డా మళ్లీ ఓట్లు అడగడం దారుణమని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్రుకాల్చి వాత పెట్టాలని సూచించా రు. ఇప్పటికైనా గమనించి మన్నె శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే రైతుల మోటర్లకు మీటర్ల ను బిగిస్తారన్నారు. 40 ఏండ్ల కాలంలో కో యిల్సాగర్ కింద ఒక ఎకరం పొలం ఎండిపోలేదని, ఈ చేతకాని సీఎం రేవంత్రెడ్డి నిర్వాకం వల్ల ఈ సంవత్సరం దాదాపు వెయ్యి ఎకరాల వర కు పంట ఎండిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశా రు. సీఎం రేవంత్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా తన సీటును కాపాడుకోవడం కోసమే ప నిచేస్తున్నారని ఆరోపించారు. ఆయా కార్యక్రమాల్లో భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, బాలకోటి, రామకృష్ణ, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్గౌడ్, మాజీ సర్పంచులు నారాయణగౌడ్, సత్యనారాయణ, సాయిలు, మురళీధర్గౌడ్, అహ్మద్, సాధిక్, రాములు, ప్రేమ్, బీ ఆర్ఎస్ నవాబ్పేట మండలాధ్యక్షుడు నర్సింహులు, జె డ్పీటీసీ రవీందర్రెడ్డి, ఎంపీపీ అనంతయ్య, వైస్ ఎం పీపీ సంతోష్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ల క్ష్మయ్య, మాజీ ఎంపీపీ శీనయ్య, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్, చెన్నయ్య, గోపాల్గౌడ్, అబ్దుల్లా, నవనీతరా వు, శ్రీను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంపీగా ఉన్న ఐదేండ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేశా. ముఖ్యంగా పాలమూరు యూనివర్సిటీకి రూ.50 కోట్లు, జాతీయ రహదారుల అభివృద్ధికి ఎంతో కృషి చేశా.రాష్ర్టాన్ని కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ప్రథమస్థానంలో నిలిపారు. కేసీఆర్ హయాంలోనే రైతుల ముఖాల్లో సుఖసంతోషాలు చూశాం. రైతును రాజుగా చేశాం. అన్ని వర్గాల వారిని ఆదుకున్న కేసీఆర్ను వయస్సుతో సంబంధం లేకుండా విమర్శిస్తున్నారు. అబద్ధపు హామీలతో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారు. మూడు నెలలు దాటినా ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు. బీజేపీ నాయకులు అయోధ్యలో గుడి కట్టి, అక్షింతలు పంపించి ఓట్లు అడగడం విడ్డూరం. ప్రజలకు మేలు చేసి ఓట్లు అడగాలి. స్థానికుడినైన నాకు రెండోసారి అవకాశం కల్పిస్తే జీవితాంతం మీకు రుణపడి పనిచేస్తా. నాపై కేసీఆర్ ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయను.