పాలమూరు, ఫిబ్రవరి 28 : ఇంటింటా భజన కార్యక్రమాన్ని అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచారసమితి ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్లో నిర్వహించిన అఖండ భజన కార్యక్రమానికి శ్రీనివాస్గౌడ్ హాజరై నీలకంఠస్వామికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ హయాంలో రూ.5 లక్షలు అందజేసినట్లు గుర్తు చేశారు.
రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. అదేవిధంగా రవీంద్రనగర్లోని పోచమ్మ ఆలయంలో అమ్మవారిని మాజీ మంత్రి దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేశ్, రాజేశ్వర్, ప్రచార సమితి జిల్లా అధ్యక్షుడు నరేందర్, సతీశ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.