మహబూబ్నగర్ అర్బన్, ఏప్రిల్ 17 : ప్రభుత్వ వైఫల్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కా ర్యాలయంలో సోషల్ మీడియా సమన్వయకర్త ఆ శాప్రియ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి మాజీ మంత్రి హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రె స్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. రూ.రెండు లక్షల రుణం తీసుకోండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని మోసం చేసిందన్నారు.
కేసీఆర్ ప్ర భుత్వంలో ఎకరం పంట కూడా ఎండిపోకుండా రైతులకు సాగునీరందించిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రణాళిక లోపం వల్ల పంటలు ఎండబెట్టి రైతులను రోడ్డు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కనీసం పెట్టుబడి సాయం కూడా అందించకపోవడంతో పంట లు చేతికిరాక అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్య లు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి తీరా ఆ హామీలను అమలు చేయకుం డా తాత్సారం చేస్తున్న విషయాను సోషల్ మీడి యా ద్వారా ప్రజలకు చేరవేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెడుతున్నందుకు ఎవరైనా బెదిరించినా భయపడవద్దని మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉం టుందని, అదేవిధంగా బీఆర్ఎస్పై సోషల్ మీడియాలో ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని సైతం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ప్రజలందరూ ప్ర భుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇద్దరు స్థానికేతరులని ఎంపీ మ న్నె శ్రీనివాస్రెడ్డి స్థానికుడని, ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం ఎంపీ మన్నె మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగించి అధికారం చేపటిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలు, రైతులను ఇబ్బందుల పాలు చే స్తున్నదని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికైనా కాం గ్రెస్ చేస్తున్న మోసాన్ని గుర్తించి తెలంగాణ అభివృద్ధికి కృషి చేసిన బీఆర్ఎస్కు అండగా నిలిచి తనను మరోమారు గెలిపించాలని కోరారు.