నారాయణపేట, మార్చి 15: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీఎస్పీ కలిసికట్టు గా పోటీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్రావు తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మ డి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నా రు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నారాయణపేట జిల్లా కార్యాలయంలో గద్వాల ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, ఆలవెంకటేశ్వరరెడ్డి, అం జయ్య యాదవ్, ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్కుమా ర్ రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం లో మాట్లాడారు.
బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తులో భాగంగా నాగర్కర్నూల్, హైదరాబాద్ స్థానాలను బీఎస్పీకి కేటాయించామని, ఈ రెండు చోట్ల బీఎస్పీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టు గా పని చేస్తారన్నారు. అలాగే మిగిలిన 15 స్థా నాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం బీఎ స్పీ నాయకులు పని చేసి సహకరిస్తారని చెప్పా రు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి చెందిన కౌన్సిల ర్లు, ఎంపీటీసీలు అందరూ పార్టీ అభ్యర్థికి సం పూర్ణ మద్దతు ఇస్తామన్నారని తెలిపారు.
ఇటీవల శాసనమండలి ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయకపోవడం వలన కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. ప్రస్తుతం శాసనమండలి ఎన్నికల్లో మొత్తం 1,400 ఓట్లలో కాంగ్రెస్కు కేవలం 350 ఓట్లే ఉన్నాయని అ న్నారు. అయినా పోటీలో ఎలా నిలబడతారన్నారు. బలం లేకున్నా గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.
రూ.2లక్షల రుణమాఫీ చేయకున్నా, 24 గంటల కరెంటు ఇవ్వకున్నా, కల్యాణలక్ష్మి కిం ద తులం బంగారం ఇవ్వకున్నా, ఆసరా పింఛ న్లు పెంచి ఇవ్వకున్నా, వరి పంటకు బోనస్ ఇ వ్వకున్నా, 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని మాజీ ఎ మ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ పేట జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ లు అమలుచేస్తామన్నారని, అందువల్లే వంద రోజులు తాను ప్రశ్నించకుండా ఉన్నానని తెలిపారు. నేటితో 100 రోజులు పూర్తయ్యాయని, ఇక నుంచి ప్రశ్నించడం మొదలు పెడతానన్నా రు.
ఇప్పటి ఎమ్మెల్యే తాను మొదలుపెట్టిన ప నులనే ప్రారంభిస్తున్నారు తప్పా.. గత వందరోజులుగా ఒక్క కొత్త పనికి కూడా శంకుస్థాపన చేయలేదన్నారు. తాను ఆమోదముద్ర వేయించిన ఎన్ఆర్ఈజీఎస్ పనులకు నేడు గ్రామాల్లో ఏ హోదాలో కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపనలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా కొడంగల్-నారాయణపేటను జంట న గరాల మాదిరిగా అభివృద్ధి చేస్తానని చెప్పిన సీ ఎం రేవంత్రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికే రూ.5వేల కోట్లు మంజూరు చేయించుకున్నా డు తప్పా, పేట నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క పైసా ఇవ్వలేదన్నారు.
కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి తాను వ్యతిరేకంకాదని, కానీ ఈ ప్రాజెక్టు వలన నారాయణపేట నియోజకవర్గానికి పెద్ద ప్రయోజనం లేదన్నా రు. 90శాతం పనులు పూర్తయిన పాలమూ రు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో వెంటనే కాల్వలను తవ్వాలని డిమాండ్ చేశారు. గద్వా ల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడు తూ పొత్తులో భాగంగా నాగర్కర్నూల్ బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేస్తారన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు విజయ్సాగర్, చంద్రకాంత్, కన్నా జగదీశ్, సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.