వనపర్తి, ఫిబ్రవరి 19 : ఆనాటి పాలనలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం కల్పించి వ్యవసాయంపై తన మక్కువను చాటుకున్న గొప్ప మహోన్నతి వ్యక్తి ఛత్రపతి శివాజీ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను పురస్కరించు కొని పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని శివాజీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ శివాజీ మహరాజ్ భారతదేశం గర్వించే దిశగా ప్రజా సంక్షేమం, మహిళా రక్షణ, హైందవ సంస్కృతులకు ప్రాధాన్యం కల్పించారన్నారు.
ఆయన చేసిన సాహసోపేతమైన నిర్ణయా లు సమాజానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పలుస రమేశ్గౌడ్, మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు నాగన్నయాదవ్, పాకనాటి కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు చెన్నరాములు, ఉంగ్లం తిరుమల్, ఎల్ఐసీ కృష్ణ, పరంజ్యోతి, గులాంఖాదర్, ప్రేమ్నాథ్రెడ్డి, గిరి, ఎర్ర శ్రీనివాసులు, జగదాంబ యూత్ సభ్యులు వినోద్గౌడ్, సుబ్బు, గణేశ్గౌడ్, రాహు ల్, వంశీకృష్ణ, శివగౌడ్, చీర్ల రాజేందర్, శివసాగర్తోపాటు యువకులు పాల్గొన్నారు.