అమ్రాబాద్, ఏప్రిల్ 27 : ఎండా కాలంలో నల్లమల అటవీ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూ నే ఉంటాయి. అడవిలో చెలరేగే మంటలతో వన్యప్రాణులు, వృక్ష సంపదకు తీవ్ర హాని కలుగుతున్నది. అటవీ ప్రాం తంలో ఉన్న చెట్లు ప్రధానంగా ఆకురా ల్చే రకానికి చెందినవే. వానకాలంలో గ డ్డి విపరీతంగా పెరిగి వేసవిలో ఎండిపోతుంది. చిన్న నిప్పురవ్వ పడినా ఎండు ఆకులు, గడ్డి అంటుకొని మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే, గత ఐ దేండ్లతో పోలిస్తే ప్రస్తుతం కార్చిచ్చు తక్కువైదని అధికారులు చెబుతున్నారు.
ప్రమాదాలకు కారణాలు..
అటవీ ప్రాంతంలో ఫల సేకరణకు వెళ్లేవారు, పశువుల కాపరుల వల్లే ఎక్కువగా కార్చిచ్చులు ఏర్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. బీడీలు, సిగరెట్లు కాల్చి ఆర్పకుండా పడేయడం, వంటలు వండుకొని నిప్పులు వదిలేయడం వల్ల అగ్ని ప్రమాదం సంభవిస్తున్నది. ఎండుగడ్డి కాలిస్తే.. మొదళ్లలో వానకాలంలో కొత్తగడ్డి వస్తుందనే ఆలోచనతో పశువుల కాపరులు గడ్డికి నిప్పు పెడుతుంటారు. దీంతో కార్చిచ్చుల వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటున్న ది. మంటల వ్యాప్తితో కీటకాలు మృతి చెందడంతో ఆ ప్రాం తంలోని వృక్షాల్లో పరపరాగ సంపర్కం నెమ్మదిస్తుంది. జంతువులు, పాములు, పక్షులగుడ్లు, అరుదైన జాతికి చెందిన నక్షత్ర తాబేళ్లు, వేగంగా పరుగెత్తలేని ఎన్నో రకాల జంతువు లు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఔషధ మొక్కలు కూడా కాలి బూడిదవుతున్నాయి. గడ్డి, వృక్షాల బూడిద వర్షపు నీటి ద్వారా నేలలోకి చేరి భాస్వరం శా తం పెరిగి సహజత్వాన్ని కోల్పోతుంది. నేల పై పొరలు వేడికి దెబ్బతిని నీటిని నిల్వ చేసుకొనే శక్తిని కోల్పోతాయి. వీటిపై ఏటీఆర్ ఆధ్వర్యంలో వేసవికి ముం దే ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్న ది. అడవుల రక్షణ వాటి బాధ్యతపై వివరిస్తున్నది.
మరిన్ని చర్యలతో నివారణ..
అడవిలో అగ్ని ప్రమాదాలను పసిగట్టేందుకు సరిపడా వాచ్టవర్లు, క్విక్ రెస్పాండ్ టీంలు, ఘటనా స్థలానికి వాహనాలు వెళ్లేందుకు సరైన రహదారులు లేవు. మంటల వ్యాప్తిని అరికట్టేందుకు రాతి కట్టడాలు, ఫైర్లైన్ల సంఖ్య మరింత పెం చాల్సిన అవసరం ఉన్నది. అడవిలో ప్రజలు రాకపోకలు కొ నసాగించే మార్గాల్లో నిఘా పెంచి అగ్నికారక వస్తువులను స్వాధీనం చేసుకోవాలి. ఏటీఆర్ కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ఇతర పులుల అభయారణ్యాల్లో ఎక్కువ సంఖ్యలో వాచ్టవర్లు, రహదారులు, క్విక్ రెస్పాండ్ టీంలున్నాయి.
ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం..
నల్లమల అటవీ స మీప గ్రామాల ప్రజలకు అవగాహన క ల్పించి పలు సూచన లు చేశాం. అగ్నిప్రమాదాల వల్ల ప్రకృతి కి జరిగే నష్టాన్ని వివరించాం. ఫైర్లైన్లు, అదనపు వాచ్టవర్ల నిర్మాణం, క్విక్ రె స్పాండ్ టీంల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకుంటాం. అడవులను కాపాడడంలో ప్రజలు భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తాం. గత ఐదేండ్లతో పోలిస్తే కార్చిచ్చులు చాలా తక్కువయ్యాయి. ప్రజల సహకారంతో అగ్ని ప్ర మాదాలు లేని అడవులుగా మార్చడమే ల క్ష్యంగా సిబ్బందిని సమాయత్తం చేస్తాం. మ రిన్ని అవగాహన కార్యక్రమాలు చేపడతాం.
– రోహిత్ గోపిడి, అటవీ శాఖ జిల్లా అధికారి, నాగర్కర్నూల్