బాలానగర్, జనవరి 6 : మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతున్న కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆ దుకుంటామని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, మైరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే మృతి చెం దిన ఐదుగురు కుటుంబాలకు రూ. 10 వేల చొ ప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. అదే వి ధంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కూడా మృ తుల కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను కలిసి పరామర్శించారు. అనంతరం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శిం చి, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 50 వేల ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. కా ర్యక్రమంలో జెడ్పీటీసీ జర్పుల కల్యాణి, వైస్ ఎం పీపీ వెంకటాచారి, లక్ష్మణ్ నాయక్, దేశ్ముఖ్ ప్ర తాప్రెడ్డి, యాదిరెడ్డి తదితరులు ఉన్నారు.