మక్తల్ టౌన్, అక్టోబర్ 29 : రాష్ట్రంలో మత్స్య సంపద పెంపొందించడమే ప్రభు త్వ లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం నుం చి వంద శాతం రాయితీతో మంజూరైన చేప పిల్లలను శనివారం ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి సంగబండ రిజర్వాయర్లో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ మత్స్యకారులకు రాయితీపై చేపపిల్లలను అందజేస్తున్నట్లు చెప్పారు. మక్తల్ నియోజకవర్గంలోని మూడు రిజర్వాయర్లు, చెరువుల్లో 92 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం అందించినట్లు తెలిపారు. పెరిగిన చేపపిల్లలతో ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
త్వరలోనే మూడు రిజర్వాయర్లలో చేపపిల్లల సీడ్ను ఉత్పత్తి చేసే యూనిట్ను తీసుకొస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందించిన చేప పిల్లలను పెంచి వాటిని బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు రవాణా నిమిత్తం రాయితీపై వాహనాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ రాణాప్రతాప్, మాగనూర్ జెడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, ఫిషరీస్ ఫీల్డ్ఆఫీసర్ వర్ధన్, అనిల్, మానిక్యప్ప, సహకార సంఘం సభ్యులు తిప్పన్న, రమణ, కిష్టప్ప, నర్సింహులు, కనకరాజు, మల్లేశ్, నాగప్ప, భాస్కర్, శంకర్, ఆశప్ప, అయ్యప్ప, అంజి తదితరులు పాల్గొన్నారు.