మహబూబ్నగర్ అర్బన్, మే 23 : నూతన సచివాల యం ప్రారంభమయ్యాక మొదటి సంతకం సీఎం కప్ కు సంబంధించిన పైల్ మీదనే చేశానని క్రీడాశాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని స్టేడి యం గ్రౌండ్లో జరిగిన సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో మంత్రి మంగళవారం పాల్గొని క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. బాస్కెట్ బాల్ బాలురు మొదటి బహుమతి మహబూబ్నగర్ అర్బ న్, రెండో బహుమతి నవాబ్పేట్, బాలికలకు మొ దటి బహుమతి మహబూబ్నగర్ అర్బన్, రెం డో బహుమతి మహబూబ్నగర్ రూరల్, ష టిల్ (సింగిల్స్) మొదటి బహుమతి అబ్దు ల్ రెహమాన్, రెండో బహుమతి భానుప్రకాశ్, షటిల్ బ్యాడ్మింటన్(డబుల్స్)సయ్యద్, జీషన్, హ్యాండ్బాల్ బాలురు మొదటి బహుమతి(మహబూబ్నగర్), రెండో బహుమతి భూత్పూర్, బాలికల మొదటి బహుమతి మహబూబ్నగర్, రెండో బహుమతి జడ్చర్ల, ఖోఖో (బాలురు) మొదటి బహుమతి కోయిల్కొండ, రెండో బహుమతిని మహ్మదాబాద్ క్రీడాకారులకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్, డీఈవో రవీందర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, జిలాస్థాయి క్రీడా అధికారులు వేణుగోపాల్, ఆయుబ్ఖాన్, అంజిలయ్య, శైలజ, భవ్యశ్రీ, శారద, ఉమాదేవి తదితరులు పాల్గొనారు.