మహబూబ్ నగర్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్ఐ కుటుంబానికి ఆర్థిక సాయం స్నేహితులు ఆర్థిక సాయం అందించి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర్ రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ గౌడ్ మరణించారు. ఇటువంటి విషాద సమయంలో స్నేహితుడి కుటుంబానికి అండగా నిలవాలని తలచిన బ్యాచ్ మేట్స్ అంతా కలిసి రూ. 29 లక్షలు పోగు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న 1103 మంది రాఘవేందర్ స్నేహితులు అనుకున్నదే తడవుగా ఈ డబ్బును జమ చేస్తూ, తమకు దూరమైన స్నేహితుడి పిల్లల భవిష్యత్తు కొరకు ఆ కుటుంబానికి అందజేశారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఏకాదశ దిన కర్మ రోజున ఈ డబ్బును రాఘవేందర్ కుటుంబానికి బ్యాచ్ మేట్స్ చెక్ రూపంలో అందించారు.