కోయిలకొండ, నవంబర్ 16 : బీఆర్ఎస్తోనే సంక్షేమ పాలన అందుతుందని, కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ పదేండ్లలోనే ఊహించని విధంగా అభివృద్ధి చేశారని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని శేరివెంకటాపూర్లో కురుమయాదవుల ఆత్మీయ సమ్మేళంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన విద్యుత్, సాగునీటితో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. గతంలో పోల్చుకుంటే పంట సాగుశాతం అమోఘంగా పెరిగి రైతులు సంతోషంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు 3గంటల కరెంట్తో 10 హెచ్పీ మోటర్లు పెడితే రైతులకు ఆగం చేయడమేనన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికీ అందాయని, పార్టీలకతీతంగా అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పాటుపడుతున్నట్లు తెలిపారు. గతంలో పాలించిన కాంగ్రెస్కు కురుమయాదవులకు గొర్రెలను అందించాలని ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
ఎలాంటి అభివృద్ధి చేయకుండా.. నేడు అభివృద్ధి చేస్తున్న వారికి అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో మండలంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందుతుందని, కురుమయాదవులు గొర్రెల మేత కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం మండలంలోని కేశ్వాపూర్, పారుపల్లి నుంచి కాంగ్రెస్,బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో పేట సమన్వయకర్త ఎస్.రవీందర్రెడ్డి, జె డ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, రైతుబంధు సమితి కన్వీనర్ మల్లయ్య, వైస్ ఎంపీపీ కృష్ణయ్య, సర్పంచులు మొగులయ్య, నారాయణయాదవ్, ఆంజనేయులుయాదవ్, హన్మంతు, రాములు, నాయకులు విద్యాసాగర్, రవి, నాగయ్య, భీంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సతీశ్, మైబన్నతోపాటు తదితరులు పాల్గొన్నారు.