పెబ్బేరు, మార్చి 22 : కొర్రమీను రకం చేపల పెంపకం తో అధిక లాభాలు ఆర్జించవచ్చని పెబ్బేరులోని మత్స్య కళాశాల విద్యార్థులకు రైతులు తెలిపారు. ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా చిన్నచింత కుంట మండలం నెల్లికొండలో శుక్రవారం విద్యార్థులు పర్యటించారు. ఈ సందర్భంగా కొర్రమీను చేపల పెం పకం చేపట్టిన రైతు మధుసూదన్రెడ్డితో వారు మా ట్లాడారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆయన చేపల పెంపకంలో మంచి లాభాలు ఆర్జిస్తున్న విషయాన్ని తె లుసుకున్నారు. కొర్రమీను విత్తనాల విలువ, వాటి సాంద్రత, మేత సమయం, నాణ్యత, మార్కెటింగ్, లా భాల గురించి ఆయన విద్యార్థులకు వివరించారు. కా ర్యక్రమంలో మత్స్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నాగలక్ష్మి, ప్రోగ్రాం అధికారి దేవానంద్ పాల్గొన్నారు.