మక్తల్ అర్బన్, నవంబర్ 23 : రైతులు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మ క్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించారు. మం దిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కొందరు రైతులు పింఛన్ ఇవ్వాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కేంద్రాల్లో రైతులతో కలెక్టర్ మాట్లాడారు. మండలంలో 19,537 ఎకరాల్లో వరి పండించారని, ప్రతి రైతు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావాలని తెలిపారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని, తేమ శాతం పరిశీలించే మిషన్లను అధికారులు అందుబాటులో పెట్టుకోవాలన్నారు. టోకెన్ ప్రకారం రైతులతో ధాన్యం కొనుగోలు చేయబడుతాయన్నారు.
అనంతరం పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. 26 మంది నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి సోమవారం మండలకేంద్రంలో ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల ను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా సి విల్ సైప్లె అధికారి శి వప్రసాద్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మేనేజ ర్ హాతిరాం నాయక్, మండల వ్యవసాయాధికారి మిథున్ చక్రవర్తి, తాసిల్దార్ రాణాప్రతాప్ సింగ్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్స్వామి, వివిధ శాఖల అధికారులు, నాయకులు, గ్రామ స్తులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం గ్రా మ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత తమదేనని గుర్తు చేశారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిలిచిపోయాయని వెంటనే చేపట్టాలని కార్యదర్శులను ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమం నిరంతరం చేపట్టాలని, వ చ్చే హరితహారం కార్యక్రమానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలన్నారు. అంతకు ముందు జక్లేర్లో నర్సరీని సందర్శించి బ్యాగు ల ఫీడింగ్ విధానాన్ని పరిశీలించారు. కూలీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
‘మన ఊరు – మన బడి’తో సమూల మార్పులు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి తో సర్కారు బడుల్లో సమూల మార్పులు వచ్చాయని కలెక్టర్ అన్నారు. మండలంలోని గుడిగెండ్ల ఎంపీపీఎస్ పాఠశాల, జక్లేర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ఎంపీపీఎస్ ప్లే గ్రౌండ్ ప్రభుత్వ పాఠశాలలను బుధవారం కలెక్టర్ జెడ్పీ చైర్పర్సన్ వనజతో కలిసి సందర్శించారు. పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలల సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగం గా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కో సం నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంగన్వాడీ కేం ద్రాలను పరిశీలించి విద్యార్థుల పోషణ సరిగా అందుతుందా లేదా అని టీచర్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
‘తొలిమెట్టు’ను విజయవంతం చేయాలి
మక్తల్ టౌన్, నవంబర్ 23 : విద్యార్థుల్లో ప్రాథమిక సామర్థ్యాలను పెంపొందించడంతోపాటు ఉపాధ్యాయులు తొలిమె ట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎఫ్ఎల్ఎన్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండలంలోని పలు పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థుల సామర్థ్యాలు పరిశీలించారు. మన ఊరు – మన బడి కార్యక్రమంతో పాఠశాలలను అభివృద్ధి పర్చి ఆహ్లాదకరమైన వా తావరణాన్ని తీసుకొచ్చి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో వి ద్యను అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. పాఠశాల ల్లో 100 శాతం మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులను కేటాయిస్తున్నామన్నారు.
క్రీడాకారులకు సన్మానం
షూటింగ్ బాల్ జాతీయస్థాయి క్రీడల్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన 20 మంది క్రీడాకారులను బుధవారం కలెక్టర్ తాసిల్దార్ కార్యాలయంలో మెడల్స్ అందించి ఘనంగా సన్మానించారని షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గోపాలం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికితీసి జాతీయస్థాయిలో క్రీడా ప్రావీణ్యతను సా ధించే విధంగా తయారు చేసిన పీఈటీలను కలెక్టర్ అభినందించారన్నారు. జిల్లాలోని క్రీడాకారులకు ఎల్లప్పుడు తమవంతు సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారన్నారు.
కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
మరికల్, నవంబర్ 23 : రైతులు పండించిన వరి పంటను నేరుగా కొనుగోలు కేంద్రానికి తరలించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ధన్వాడ మండలంలోని మందిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ తేమ శాతం 17కు తగ్గకుండా చూసుకోవాలన్నారు.