మహబూబ్నగర్ అర్బన్, ఫిబ్రవరి 8 : తెలంగాణ లో జాతీయ ఆయిల్పాం బోర్డు ఏర్పాటు చేయాలని, ఆయిల్పాం పండించే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని బీఆర్ఎస్ ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, రాములు, బీబీ పాటిల్ గురువారం ఢిల్లీలో కేంద్ర వ్యవసా య, రైతు సంక్షేమ శాఖల మంత్రి అర్జున్ ముండాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయిల్పాం పండిస్తున్న రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదని మంత్రి దృష్టికి తీసుకుపోయారు. ప్రస్తుతం సాగు కోసం రూ.18 వేలు ఇవ్వడంతో రైతులకు ఇబ్బందిగా మారిందని దానిని కనీసం రూ.20 వేలకు పెంచి తెలుగు రాష్ర్టాల ఆయిల్ పాం రైతులను ఆదుకోవాలని వారు కోరారు.
గద్వాల /అచ్చంపేటటౌన్, ఫిబ్రవరి 8 : వైద్య రంగ అభివృద్ధికి సహకారం అందించాలని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి మాండవీయకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో గతంలో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవారన్నారు. గద్వాల నుంచి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు వైద్య సదుపాయం కోసం వెళ్లేవారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం గద్వాల ప్ర భుత్వ దవాఖానలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో తీసుకువచ్చిందని, డయాలసిస్ సెంటర్ను, డయాగ్నోసిస్ సెంటర్ను ఏర్పాటు చేసిందన్నా రు. అదేవిధంగా అప్పటి మంత్రి హరీశ్రావు సహకారంలో 300 పడకల దవాఖాన నిర్మాణం, నర్సింగ్, మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామని, అయి తే వైద్య రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ లు, ఎమ్మెల్యే తెలిపారు.