దేవరకద్ర, మార్చి 27 : దేవరకద్ర మార్కెట్కు రైతులు ఉల్లిగడ్డను బుధవారం అత్యధికంగా తీసుకొచ్చారు. గతేడాది దిగుబడి లేక రూ.3వేల మార్క్ దాటిన ఉల్లి ధరలు ఈ ఏడాది దిగుబడులు పెరగడంతో సగం ధరకు పడిపోయాయి. కూలి, రవా ణా, పెట్టుబడి పోనూ రైతులకు నష్టాలు ఎదురవుతున్నాయి. దాదాపు 10వేల క్వింటాళ్లకు పైగా ఉల్లి విక్రయానికి వచ్చినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. క్వింటాల్ గరిష్ఠంగా రూ.1,400 ధర పలుకగా, కనిష్ఠంగా రూ.900ల వరకు పలికింది. గత వారంతో పోల్చితే రూ.100 ధర తగ్గింది.
జడ్చర్ల, మార్చి 27 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం వేరుశనగకు అత్యధికంగా క్వింటా రూ.7,036 ధర పలికింది. మార్కెట్కు 745 క్వింటాళ్ల వేరుశనగ రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.7,036, కనిష్ఠంగా రూ.4,650, మధ్యస్తంగా రూ.6,395 ధర పలికింది. ఉలువలు క్వింటాకు రూ.6,819, ఆముదాలు క్వింటాకు రూ.5,859, పెసర్లు క్వింటాకు గరిష్ఠంగా రూ.3,819, జొన్నలు క్వింటాకు గరిష్ఠంగా రూ.5,090, పత్తి క్వింటాకు గరిష్ఠంగా రూ.7,111, మొక్కజొన్న క్వింటాకు గరిష్ఠంగా రూ.2,231 ధర పలికినట్లు బాదేపల్లి మా ర్కెట్ అధికారులు తెలిపారు.