మహబూబ్నగర్ అర్బన్, ఆగస్టు 17 : జమీందారు ల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న అని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఆయన పేదోళ్ల రా జు అని కొనియాడారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న గ్రీన్బెల్ట్ వద్ద సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి.. పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ దళిత బహుజనులు ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధించొచ్చని నిరూపించిన మహనీయుడు స ర్వాయి పాపన్న అని అన్నారు. ఆయన అంతర్జాతీయం గా ఎంతో ఖ్యాతిగడించారన్నారు. పాపన్న వీరత్వానికి గుర్తుగా లండన్ మ్యూజియంలో విగ్రహాన్ని పొందుపరిచారన్నారు.
33 కోటలను జయించిన మహావీరుడు అని, అయినా ఏనాడూ రాజభోగాలను అనుభవించలేదన్నారు. చాకలి ఐలమ్మ, సురవరం ప్రతాప్రెడ్డి, పండు గ సాయన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మహానీయులు కులమతాలకతీతంగా సేవచేశారన్నారు. వారిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా స్మరించుకుంటుందన్నారు. పాపన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా ని ర్వహిస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా ప రిగెడుతున్నాయన్నారు. మహబూబ్నగర్ ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుంటే కొందరు దుర్మార్గులు ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఐటీ టవర్ వల్ల వేలాదిమంది స్థానికులు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కల్లు గీతా కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్గౌడ్, ముడా చైర్మన్ వెంక న్న, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్గౌడ్, జిల్లా అధ్యక్షుడు ఆనంద్గౌడ్, చక్రధర్గౌడ్, గోపాల్యాదవ్, శాంతన్నయాదవ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ ఉన్నారు.
హన్వాడ, ఆగస్టు 17 : గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధిలో పార్టీలకతీతంగా కలిసిరావాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. మండలంలోని చిన్నదర్పల్లి గ్రామంలో బీజేపీ గ్రామ అధ్యక్షుడు గోవింద్తోపాటు 100మంది మంత్రి సమక్షంలో గురువారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లోకి స్వచ్ఛందంగా వస్తున్నారన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి చెరువునూ నింపుతామన్నారు. గతానికి, ఇప్పటికీ జరిగిన అభివృద్ధి గురించి కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి వార్డులో సీసీరోడ్లు, డ్రైనేజీలు, గ్రామాల్లో బీటీ రోడ్లు వేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లతశ్రీ, నాయకులు యాదయ్య, ఆంజనేయులు, లక్ష్మణ్, రమేశ్ ఉన్నారు.