హన్వాడ, అక్టోబర్ 3 : దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధం గా క్రీడా ప్రాంగణాలను తెలంగాణలో 25వేల గ్రామాల్లో ఏర్పాటు చేసి, కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేస్తున్నామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మం గళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆ వరణలో రాష్ట్ర వ్యాప్త కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు సామగ్రి పంపిణీ చేసి మాట్లాడారు. క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలించిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 18వేల క్రీడా మైదానాలను పూర్తి చేశామని, రూ.50వేల క్రీడా సామగ్రిని కిట్ రూపంలో అందిస్తున్నామన్నారు. గ్రామీ ణ క్రీడాకారులను వెలికి తీసేందుకే సీఎం కేసీఆర్ క్రీడా మైదనాలను ఏర్పాటు చేశారని వివరించారు. మండలంలో 35 కిట్లు, జిల్లావ్యాప్తం గా మొత్తం 360 కిట్లను పంపిణీ చేస్తున్నామని, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలోనే అతి పెద్ద ఎకో అర్బన్ పార్క్ను ఏర్పాటు చేసుకున్నామని, ప్రతి రోజూ వందలాది మంది పర్యాటకులు వస్తున్నారన్నారు.
పీఆర్ఎల్ఐ ప్రాజెక్టుతో తాగు, సాగునీటికి ఢోకా ఉండదన్నారు. హరితహారం కింద 4కోట్ల 35వేల మొక్కలు నాటామని తెలిపారు. క్రీడలకు సర్కారు సముచితస్థానం కల్పిస్తున్నదని, క్రీడాకారు లు సామగ్రిని సద్వినియోగం చేసుకోవాలని సీఎస్ శాంతికుమారి అన్నారు. క్రీడాకారులు రాణించి రాష్ర్టాన్ని ముం దుకు తీసుకెళ్లాలని సూచించారు. పాలమూరును సస్యశ్యామలం చేయడంలో మంత్రి కృషి ఎంతో ఉన్నదన్నారు.
రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను చూస్తుంటే సంతోషంగా ఉన్నదన్నారు. కార్యక్రమంలో క్రీడా శాఖ చైర్మన్ ఆంజనేయగౌడ్, డైరెక్టర్ లక్ష్మి, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, ఎంపీపీ బాలరాజు, డీఆర్డీఏ పీడీ యాదయ్య, జెడ్పీటీసీ విజయనిర్మల, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసీల్దార్ కిష్టానాయక్, సర్పంచ్ రేవతి, ఎంపీటీసీ సత్యమ్మ, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్కు దీటుగా పాలమూరు
మహబూబ్నగర్ టౌన్, అక్టోబర్ 3 : మహబూబ్నగర్ ప ట్టణాన్ని హైదరాబాద్కు దీటుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఆబ్కారీ, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో పట్టణ ప్ర జలు తాగునీరు, కరెంటు, వార్డులో అంతర్గత రోడ్లు లేక నానా ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా నిరంతరం తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. 70 ఏండ్లల్లో జరుగని అభివృ ద్ధి తొమ్మిదేండ్లలో పూర్తి చేశామన్నారు. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్లు శ్రీలత, కిశోర్, ప్రవీణ్, రోజా, ఉమర్, సంధ్య, మోతీలాల్, అంజ య్య, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.