జడ్చర్ల, నవంబర్ 29 : జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ తెలిపారు. బుధవారం జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికల సమగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ రవినాయక్, ఎస్పీ హర్షవర్ధన్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. అదేవిధంగా ఈవీఎంలు, వీవీపాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది అందరు వచ్చారా, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎన్నికల సామగ్రిని అందించాలని ఎన్నికల అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రవినాయక్ మాట్లాడుతూ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే పోలింగ్కు అన్ని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలు, వీవీపాట్లతో పాటు మిగతా సామగ్రిని అందించారు. ఓటింగ్శాతం పెంచేందుకు చూడాలని సూచించారు. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,20,244ఓటర్లు ఉండగా అందులో 1,10,783మంది పురుష ఓటర్లు, 1,09,456 మంది మహిళా ఓటర్లు, ఐదుగురు ఇతర ఓటర్లు ఉన్నారు.
నియోజకవర్గంలో మొత్తం 274పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 29రూట్లు, 29మంది సెక్టోరల్ అధికారులు ఉన్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో ఐదు మహిళా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వాటిని నవాబ్పేట, తిరుమలాపూర్, నేరళ్లపల్లి, బాదేపల్లి సెయింట్ఆగ్నస్, ఊర్కొండ, ఉండగా ఆరు మోడల్ పోలింగ్ స్టేషన్లు జడ్చర్ల, వేముల, రేవళ్లి, రాజాపూర్, గుంగేడు, తీగలపల్లి, ఒక్క దివ్యాంగులు బాదేపల్లి, ఒకటి యువకులు ఇందిరానగర్లో ఏర్పాటు చేశారు. ఇందుకుగానూ దాదాపు 1300 వందల సిబ్బందిని ఏర్పాటు చేశారు. మొత్తం 274 పోలింగ్ కేంద్రాలకుగానూ ఒక్కో పోలింగ్ స్టేషన్కు పీవో, ఏపీవో ఇద్దరు ఓపీవోలను కెటాయించారు. మొత్తం 274పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు, వీవీప్యాడ్లను అందజేయడంతో వారందరూ వాటిని తీసుకొని బస్సుల్లో వారివారీ పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 274పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ ద్వారా కెమెరాలను ఏర్పాటు చేసి వాటిద్వారా ఎన్నికల ప్రక్రియను ఉదయం ఓటింగ్ ప్రారంభం నుంచి సాయంత్రం ఈవీఎంలు తీసుకెళ్లే వరకు నిఘాతో చూడనున్నారు. అదేవిధంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీరు, టాయిలెట్స్, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఈఆర్వో మోహన్రావు తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారి కోసం ర్యాంపులు, ట్రైసైకిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి వచ్చే ఓటర్లు తప్పనిసరిగి ఓటరు గుర్తింపుకార్డు, పాన్కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్పాస్పుస్తంలతో పాటు మొత్తం 12రకాల ప్రభుత్వం నుంచి ఇచ్చిన గుర్తింపు కార్డులు తీసుకువచ్చి ఓట్లు వేయాలని కోరారు.
ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించడానికి వచ్చిన సిబ్బందికి ఏమైన అనారోగ్యం అయితే వారికి ఆరోగ్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడానికి డాక్టర్ శివకాంత్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సిబ్బందికి ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తారు.
జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం23 సమస్యాత్మక గ్రామాలు ఉండగా వాటి పరిధిలో 54పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల నిర్వాహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పోలింగ్కు సంబంధించిన ఎన్నికల సమగ్రిని ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. డిస్ట్రిబ్యూషన్తో పాటు రిసీవింగ్కు సంబంధించి కూడా అధికారులను ఏర్పాటు చేశారు. పో లింగ్ ముగిశాక ఈవీఎంలను తీసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పా టు చేస్తున్నారు. అదేవిధంగా జడ్చర్ల డిగ్రీ కళాశాలలో స్ట్రాం గ్రూంలను ఏర్పాటు చేసి భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలో 144సెక్షన్ అమలు చేస్తున్నారు. ఐదుగురుకి ఎక్కువగా ఎక్కడ గుమికూడదని, గుంపులుగా, ర్యాలీలుగా ఉండరాదన్నారు. జిల్లాలోని 274పోలింగ్ బూత్ల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 300మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
రాజాపూర్, నవంబర్ 29 : గురువారం జరుగే అసెంబ్లీ సాధరణ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు మండలంలోని ఆయా గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బుధవారం తాసీల్దార్ విద్యాసాగర్రెడ్డి తెలిపారు. మండలంలోని 24 గ్రా మ పంచాయతీలకు గానూ 26 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చే ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు తలేత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వృద్ధులు, దివ్యాంగులను తీసుకోచ్చేందుకు స్ట్రేచ్చర్స్, తగిన సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 29 : గురువారం ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియకు సర్వసిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు పోలీసులు బలగాల ప్రత్యేక నిఘాతో పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంటుంది. సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో 32,79,732 మంది ఈ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల విధులలో హాజరయే ఉద్యోగులకు వీవీ ప్యాట్లు అందజేశారు. పాలమూరు జిల్లాకు సంబంధించి 881 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 107 సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ కేంద్రాల్లో కేంద్ర పారా మీలిటరీ బలగాలు 8 కంపెనీలతో సంబంధిత అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలు ఎలాంటి భయభ్రతులకు గురికాకుండా చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో 4,485 వీవీ ప్యాడ్స్తో పాటు పోలీసు భద్రతా మధ్యన పోలింగ్ కేంద్రాలకు రవాణా చేయనున్నారు.
ప్రజలు స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునేలా కట్టుదిట్టమైన భద్రతా పోలీసుల బలగాలు, కేంద్ర పారా మిలిటరీ బలగాల నిఘాలో ఎన్నికపై నిఘా ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈ పోలీసు బలగాల మధ్యన ఈవీఎం ప్యాడ్స్తో తరలించారు. కేంద్రాల వద్ద ఐడీ కార్డు ఉన్నావారికి మాత్రమే అనుమతి ఉంటుంది. డీఐజీ ఎల్.ఎస్ చౌహాన్, ఎస్పీ హర్షవర్ధన్ పర్యవేక్షణలో ఏఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో పాటు కానిస్టేబుల్ సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలపై పారా మీలిటరీ బలగాల మధ్యన 800 మంది సిబ్బందితోపాటు బెంగుళూర్ నుంచి 750 మంది హోంగార్డు సిబ్బంది ఎన్నికల విధులలో ఏర్పాటు చేశారు.
జడ్చర్ల, నవంబర్ 29 : జడ్చర్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామ గ్రి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా అబ్జర్వ ర్ సంజయ్ మి శ్రా పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. అదేవిధంగా ఈవీఎంలు, ఇతర సామగ్రి పంపిణీపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.