మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 15: సంక్షేమం పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన పం ద్రాగస్టు వేడుకలకు మంత్రి శ్రీనివాస్గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నర్సింహ ముఖ్యఅతిథులుగా హాజరై గౌరవ వంద నం స్వీకరించారు. కవాతు ఏఆర్ ఇన్స్పెక్టర్ నాగేశ్ ఆధ్వర్యంలో సాయూధ బలగాల కవాతు నిర్వహించారు. అనంతరం మంత్రి ప్రసంగించారు. దేశభక్తుల త్యాగనిరతి, సామర్థ్యాలను స్మరించుకుంటూ మహానుభావులు కలలుగన్న భారతావని నిర్మాణానికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. స్వరాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లల్లోనే తెలంగాణ స్థిరమైన ఆర్థికప్రగతితో సుసంపన్న రాష్ట్రంగా ఆవరతించిందన్నారు. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర ఆదాయం రెట్టిం పు స్థాయిలో ఉందన్నారు. రైతుబంధు, రైతు బీమా, కంటివెలుగు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి, కల్యాణలక్షి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, గొర్రెల పంపిణీ, ఉచిత చేపపిల్లల పంపిణీ, దళితబంధు, ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలకు ఉచితంగా పట్టాలు, సామాజిక వర్గాల వారికి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం, జిల్లాకో మెడికల్ కళాశాల వంటి అనేక పథకాలు అమలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు.
దేశంలోనే ఆత్యంత వేగంగా ఆభివృద్ధి చెందుత్నున రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొన్నదని మంత్రి గుర్తు చేశారు. కరువు పీడత ప్రాంతం, వలసల జిల్లాగా పేరుబడిన పాలమూరు జిల్లా నేడు పచ్చని పంటలకు నెలవైందన్నారు. ఇతర రాష్ర్టాల కూలీలు సైతం ఇక్కడికి వలసలు వస్తున్నారన్నారు. రైతుబంధు ప్రారంభం నుంచి 2,19,844 మంది రైతుల ఖాతాల్లో రూ.1,917కోట్లు, రైతు బీమా కింద ఇప్పటివరకు రూ.198కోట్లు సంబంధిత నామినీల ఖాతాల్లో జమ చేశామన్నారు. దేశంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును రూ.7.40కోట్లతో 2,087 ఎకరాల్లో అభివృద్ధి చేసుకున్నామని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు 29 నుంచి 66 శాతానికి పెంచామన్నారు. కంటి వెలుగు పథకం దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. వ్యవసాయానికి ఉచిత నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ సన్మానించారు. ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా ప్రభుత్వ ఫథకాలకు సంబంధించిన స్టాల్స్ను మంత్రి సందర్శించారు. ఎస్పీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన కార్లు, ట్రాక్టర్లు, ఆటోలను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. అనంతరం చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.