నాగర్కర్నూల్, ఏప్రిల్ 10 : ప్రాథమిక వైద్యంపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణం కాపాడే సీపీఆర్ అనే ప్రాథమిక వైద్యం గ్రామస్థాయికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే మ ర్రి జనార్దన్రెడ్డి అన్నారు. మారిన జీవన విధానం, పెరిగిన ఒత్తిడితో ఈ మధ్య వయస్సుకు సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్ట్ కావ డం, రోడ్డు ప్రమాదాల బారిన పడి నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కో ల్పోతున్నారని ఆయనన్నారు. ఇ లాంటి విపత్కర పరిస్థితుల్లో సీపీఆర్ కార్డియోపల్మోనరి రిససిటీష న్, (ఏఈడీ) ఆటోమెటిక్ ఎక్సర్నల్ డిజిబ్రిలేటర్ అనే ప్రాథమిక వై ద్యం చేయడంతో మనిషి ప్రాణా లు కాపాడవచ్చన్నారు. రాష్ట్ర ప్రభు త్వం అత్యవసర ప్రాథమిక వైద్య చికిత్స సీపీఆర్, ఏఈడీ శిక్షణను ఆశ వర్కర్లు, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి శిక్షణ ఇస్తుందన్నారు.
అందులో భా గంగా సోమవారం జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్ లో ఆశ, ఏఎన్ఎం, పోలీస్ సి బ్బందికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శిక్షణా ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశలు, ఏఎన్ఎంతోపాటు గ్రామా ల్లో ఉన్న యువజన సంఘాల్లోని యువకులను శిక్షణలో భాగస్వాములను చేయాలన్నారు. డాక్టర్లను వైద్యోనారాయణ గా సంబోధిస్తారని, అనారోగ్యంతో ప్రాణం కాపాడమని దవాఖానకు వచ్చే రోగులకు ఏమికాదు నేనున్నాననే ధైర్యం చెప్పాలన్నారు. ప్రే మతో వైద్య అందిస్తే రోగులకు డా క్టర్లపై విశ్వాసం ఏర్పడుతుందన్నారు. ప్రాణం కా పాడిన డాక్టర్ను దే వుడితో సమానంగా చూస్తారన్నారు.
అనంతరం కలెక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజం లో మారిన ఆహార అలవాట్లు, జీవన విధానంలో అనేక మార్పులతో వయస్సుతో సంబంధం లేకుండా గుండె సమస్యలతో వస్తున్నాయన్నారు. అలాంటి సమయంలో వారిని కాపాడేందుకు ఒకే ఒక్క పరిష్కారం సీపీఆర్ అన్నారు. జిల్లాలో విడుతల వారీగా మెడికల్, పోలీస్, మున్సిపల్, శిశు సంక్షేమశాఖ సిబ్బందికి గ్రామస్థాయి వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం ఎన్సీడీ కిట్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ మనోహర్, డీఎంహెచ్వో సుధాకర్లాల్, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్గౌడ్, తాడూరు ఎంపీపీ శ్రీదేవి, వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, పోలీస్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.