వనపర్తి, సెప్టెంబర్ 8 : స్వరాష్ట్ర పాలనలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలంతా ఆశ్వీరదిస్తూ బీఆర్ఎస్ వైపే ఉన్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీరంగాపూర్కు చెందిన బీఆర్ఎస్ నేత పృథ్వీరాజ్ ఆధ్వర్వంలో కాంగ్రెస్కు చెందిన 20 మంది, ఖిల్లాఘణపురం మండలం నుంచి ఆయిల్పాం సాగు సలహాదారులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో 20 మంది మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు.
వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రతి పథకం బడుగు బలహీన వర్గాల అభివృ ద్ధే లక్ష్యంగా రూపొందించిందని, ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి శ్రీధ ర్, మహేశ్గౌడ్, కురుమయ్య తదితరులున్నారు.