కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్, జనవరి 2: ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం నూతన కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదులను పరిష్కరించడంతో అధికారులు పారదర్శకంగా ముందుకుసాగాలని సూచించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ తేజస్నంద్లాల్పవర్, జెడ్పీ డిప్యూటీ సీఈవో యాదయ్య తదితరులు ఉన్నారు.
క్యాలెండర్ల ఆవిష్కరణ
మహబూబ్నగర్, జనవరి 2: టీజీవో ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను కలెక్టర్ వెంకట్రావు సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీవో నేతలు ఉద్యోగ సంఘం నేతలు కలెక్టర్, అదనపు కలెక్టర్లకు పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షుడు రాజాగోపాల్, నాయకులు శ్రీనివాసులు, మధుసూదన్గౌడ్, జెడ్పీ డీప్యూటీ సీఈవో మొగులప్ప, డా.శశికాంత్, మురళీకృష్ణ, విజయ్కుమార్ ఉన్నారు. అలాగే టీఎస్జీహెచ్ఎంఏ ఆధ్వర్యంలో రూపొందించిన టేబుల్ క్యాలెండర్ను కలెక్టర్ వెంకట్రావు తన చాంబర్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జగదీశ్కుమార్, అబ్దుల్హక్, కోశాధికారి వెంకట్, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.