ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా తప్పని పరిస్థితుల్లో విద్యార్థులు వేలాడుతూ వెళ్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్న ఆర్టీసీ సంస్థ గ్రామీణ ప్రాంతాలకు సరిగా బస్సులు నడిపించకపోవడంతో విద్యార్థులు ఫుట్బోర్డుపై వేలాడుతూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మహబూబ్నగర్ నుంచి ఖిల్లాఘణపురం మీదుగా వనపర్తి వెళ్లే బస్సు కిక్కిరిసి రా వడంతో దొంతికుంట వద్ద దాదాపు 10 మంది విద్యార్థులు బస్సు ఫుట్బోర్డు వద్ద వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించడాన్ని ‘నమస్తే తెలంగాణ’ తన కెమెరాలో బంధించింది.