గద్వాల, జనవరి 12 : గద్వాల నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకం ఉంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గద్వాలను అన్ని రంగాల్లో అగ్రగామిగా ని లుపుతామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అ న్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్తో కలిసి విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మారిందని అభివృద్ధి జరగదని చాలా పుకార్లు వినిపిస్తున్నాయని అలాంటి వదంతులు ఎవరూ నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గద్వాలకు మెడికల్ కళాశాల మంజూరు చేసిందని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాల్ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా గత, ప్రస్తుత ముఖ్యమంత్రికి గద్వాల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. గద్వాల మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా మహబూబ్నగర్ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్గా పని చేస్తున్న నవకల్యాణిని నియమించడంపై ఎమ్మె ల్యే సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో నూ తనంగా నిర్మిస్తున్న 300 పడకల దవాఖాన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని మార్చిలో దానిని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
దీంతో పాటు త్వర లో మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. మెడికల్ కళాశాల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.183 కోట్ల నిధులను కేటాయించిందని, దీంతో పాటు 300వందల పడకల దవాఖాన భవన నిర్మాణం కోసం కూడా రూ.49కోట్లు విడుదల చేయగా ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. అదేవిధంగా గద్వాలలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసుకోవడంతో ప్రస్తుతం మూడో అకాడమీ తరగతులు కొనసాగుతున్నాయన్నారు. నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని దానిని త్వరలో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామన్నారు. గతంలో ఈ ప్రాంతంలో సరైనా వైద్య సదుపాయాలు లేక పోవడంతో అత్యవసర వైద్యం కోసం కర్నూల్ లేదా హైదరాబాద్కు వెళ్లేవారమని, జిల్లాలో ఇక ఆ పరిస్థితి ఉండదన్నారు. ప్రస్తుతం 180 పడకలు ఉన్న దవాఖాన 300 పడకలుగా అప్గ్రేడ్ చేయడం జరిగిందని, వీటికి అదనంగా మరో 500పడకలు వచ్చే అవకాశం ఉందన్నారు. గద్వాల నియోజకవర్గ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. సమావేశంలో ఎంపీపీలు ప్రతాప్గౌడ్, విజయ్కుమార్, మున్సిపల్ వైస్చైర్మన్ బాబర్, మార్కె ట్ కమిటీ చైర్మన్ శ్రీధర్గౌడ్, కౌన్సిలర్ నరహరిగౌడ్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మధుసూదన్రెడ్డి, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.