మహబూబ్నగర్, జూన్ 10 : రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమంతోపాటు నేడు రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులే కీలకపాత్ర పోషించారని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో సంబంధింత అధికారులతో శనివారం సుపారిపాలన కార్యక్రమం నిర్వహించారు. సమావేశానికి మంత్రి హాజరై ఉద్యోగుల సమక్షంలో కేక్ కట్ చేయగా పలువురు ఉద్యోగ సంఘాల నేతలు మంత్రిని శాలువా, పూలమాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యమంలో చేసిన పోరాటాలను ఉద్యోగుల ఎదుట స్మరించుకున్నారు. నాడు పడిన శ్రమ అంతాఇంత కాదని, నేడు స్వరాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడుతున్నామన్నారు. ఉద్యమ నేత సీఎం కేసీఆర్ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణను సాధించారన్నారు.
ప్రతి ఉద్యోగి కలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారని వివరించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం జిల్లాల విభజన, మండలాల విస్తరణ, జీపీలు, మున్సిపాలిటీల ఏర్పాటుతో సమర్థవంతమైన పాలనను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. నాడు కలెక్టర్తోపాటు జిల్లా అధికారులను కలవాలంటే చాలా ఇబ్బందులు ఉండేవని, నేడు ఆ పరిస్థితులు లేవన్నారు. అందరికీ న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి గడపకూ సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం కేసీఆర్కు మాత్రమే దక్కుతుందన్నారు. గొప్పింటోళ్ల ఇంటికైనా కనీసం మిషన్ భగీరథ నీరు చేరుతుందని తెలియజేశారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ అందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని తెలిపారు.
రానున్న మూడేండ్లల్లో 30వేల ఉద్యోగాలు రావడమే కాకుండా భవిష్యత్తులో జిల్లాకు మరిన్ని పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఉన్న చోటే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నూతన కలెక్టరేట్తోపాటు అన్ని విధాలుగా జిల్లాను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ప్రతి 50వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి వచ్చేశారని, ఆయా శాఖల పునః వ్యవస్థీకరణ తరువాత ఇరిగేషన్ తదితర శాఖలు, సీఈ, ఎస్ఈలు వచ్చారన్నారు. జిల్లాలో 5 నూతన మండలాలు, 100కు పైగా నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.
టీఎస్ ఐపాస్ ద్వారా ఒక్క బటన్ క్లిక్ చేస్తే కేవలం 15 రోజుల్లో అన్ని రకాల అనుమతులు పొందుతున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్ రవినాయక్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ మంచి చేసేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ అలోచనలను మరింత ముందుకు తీసుకుపోతూ అభివృద్ధికి మరింత చేరువగా ఉందామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ నర్సింహ, అదనపు కలెక్టర్ సీతారామరావు, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు రాజగోపాల్రెడ్డి, రాజీవ్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.