“ 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏం అభివృద్ధి జరిగింది..పేదోడు మరింత పేదగా మారుతుండగా, ఉన్నోడు మరిన్ని ఆస్తులు సంపాదిస్తున్నాడు.. సమానత్వం మచ్చుకైనా లేదు..కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తులు కట్టబెడుతూ దేశ ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్న పార్టీలకు చెక్ పెట్టాలంటే ప్రత్యామ్నాయం కావాలి..ఆ శక్తి కేవలం కేసీఆర్కు మాత్రమే ఉంది” అని మేధావులు అంటున్నారు. అసాధ్యం.. అనుకున్న స్వరాష్ట్ర ఆకాంక్షను సుసాధ్యం చేశారని, అభివృద్ధి సంక్షేమంలోనూ దేశంలోనే నెంబర్వన్గా నిలిపారని పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు దేశానికి కూడా ఎంతో అవసరమని, రైతులు, సామాన్యులకు కనీస వసతుల కల్పనకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని, అది కేసీఆర్తోనే సాధ్యమని అభిప్రాయపడుతున్నారు. దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన సమయం వచ్చిందని, నడుం బిగించి ముందుకు సాగాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఏ రాష్ట్రంలో సాధించని ప్రగతి కేవలం ఎనిమిదేండ్లలో సాధించాం. జాతీయ స్థాయిలో ఇదే మోడల్ కొనసాగాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెట్టాల్సిన అవసరం ఎంతో ఉందని ఉమ్మడి జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో గోస పడ్డాం.. సొంతంగా రాష్ర్టాన్ని సాధించాం.. ఆ ఫలాలు నేడు అనుభవిస్తున్నాం.. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా నిలిచింది’ అని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఏ ప్రభుత్వం నడవాలన్నా ఉద్యోగులే కీలకం.. అలాంటి ఉద్యోగ, ఉపాధ్యాయులు కేసీఆర్ జాతీయ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి అని విశ్లేషకులు అంటున్నారు.
తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి.. రాష్ట్రం సాధించేవరకు నిద్రపోని కేసీఆర్ ఓ విజన్ ఉన్న నాయకుడు అని చెబుతున్నారు. రాష్ర్టాన్ని ఎలా తెచ్చుకున్నారో.. అలాగే అభివృద్ధిని అన్ని వర్గాలకు పంచిపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో చీకటి రాజ్యమేలుతుంది.. విద్యుత్ ఉండదన్న నాయకులకు సవాల్ విసురుతూ రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇవ్వడం చరిత్రాత్మకమని అభిప్రాయపడుతున్నారు. ఉపాధ్యాయులు ఏం అడిగినా వెంటనే ఓకే చేసేది ఒక్క తెలంగాణలోనే అని అంటున్నారు. ఉపాధ్యాయులకు ఎక్కువ జీతాలు ఇస్తున్న రాష్ట్రం దేశంలో మనదేనని.. అది కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు.
కేసీఆర్ మార్కు సంక్షేమం..
తెలంగాణ వచ్చాక ఈ ఎనిమిదేండ్లలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాయి. ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు బాటలు వేశాయి. ఎకరాకు రూ.3 లక్షలు కూడా పలకని బీడు భూములు.. ప్రాజెక్టుల రూపకల్పనతో నేడు రూ.కోట్లు పలుకుతున్నాయి. జాతీయ, బైపాస్ రహదారులతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం, ఉచితంగా టెస్ట్లు, కార్పొరేట్ స్థాయి వైద్యం సాధ్యమవుతున్నది. ఇదే మోడల్ జాతీయ స్థాయికి విస్తరించాలంటే కేసీఆర్ ఒక్కరి వల్లే సాధ్యం. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలప్పుడు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం.. మళ్లీ ఎన్నికలు వచ్చాక పనులు ప్రారంభించడం పరిపాటిగా మారింది. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులను తమ జేబులకు ఉపయోగించి వలస జిల్లాగా పేరును శాశ్వతం చేశారు. తెలంగాణ వచ్చాక ఈ ఎనిమిదేండ్లలో పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయడం.., అనుకున్నట్లుగానే ఉమ్మడి జిల్లాలో 8 లక్షల ఎకరాలను సాగులోకి తేవడం, చెరువులను నింపడంతో పాలమూరు రూపురేఖలు మారాయి. రెండు పంటలకు పుష్కలంగా సాగు నీరు అందుతుండడంతో వలస వెళ్లిన వారంతా తిరిగి పాలమూరుకు వచ్చారు.
దేశానికి కేసీఆర్ విజన్ అవసరం
సుదీర్ఘ పోరాటంతో తెలంగాణను సాధించిన సీఎం కేసీఆర్ రాజకీయ అనుభవం ప్రస్తుతం దేశానికి ఎంతో అవసరం. రాష్ర్టాన్ని దేశంలో నెంబర్వన్గా నిలిపి పాలన సుభిక్షంగా సాగిస్తున్నారు. తెలంగాణలో రైతుల శ్రేయస్సు లక్ష్యంగా ప్రవేశపెడుతున్న పథకాలు అన్ని రాష్ర్టాల్లో ప్రవేశపెట్టాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. బీజేపీ పాలనలో వ్యవసాయం, ఆర్థిక, సామాజిక రంగాలు దిగజారిపోయాయి. ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు
కేసీఆర్ లాంటి నాయకత్వం ఎంతో అవసరం.
– వెంకటేశ్, ఉపాధ్యాయుడు, పెద్దదగడ,చిన్నంబావి,వనపర్తి
దేశ సంక్షేమానికి ముందడుగు..
దేశం సంక్షేమ రంగంలో ముందుకెళ్లాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ముందడుగు వేయాలి. ఆసరా పింఛన్లు, రైతులు, కార్మికులకు బీమా వంటి పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. రాష్ర్టానికి ఆర్థికంగా భారమైనా పేదల కోసం సంక్షేమ పథకాలకు అధికంగా ఖర్చు చేస్తూ మానవతావాదిగా నిలుస్తున్నారు. సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్న పేదల ఆశీర్వాదం సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ ఉంటుంది. వికలాంగులకు రూ.3,016 పింఛన్లు ఇవ్వడం ఎంతో సంతోషదాయకం. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు అడగకముందే పింఛన్లను పెంచిన ఉదారవాది సీఎం కేసీఆర్. ఈ సంక్షేమ పథకాలు దేశంలో కూడా కొనసాగాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలి.
– నిరంజన్, వికలాంగ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు, నాగర్కర్నూల్
అందరికీ మంచి జరుగుతుంది..
అన్నదాతలకు ఉపయోగపడే రైతుబంధు, రైతుబీమా వంటి అనేక పథకా లు దేశ వ్యాప్తంగా అమలు చేయాలి. రైతులు పండించే ఏ పంటకైనా మ ద్దతు ధర కచ్చితంగా పెంచేలా చట్టం తీసుకురావాలి. నిరుద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చేలా దేశ వ్యాప్తంగా ఉద్యోగ క్యాలెండర్ ఏర్పాటు చేయాలి. ఇదం తా జరగాలంటే ఒక్క కేసీఆర్ వల్లే సాధ్యం. ఆయన దేశ రాజకీయాల్లోకి వస్తే కచ్చితంగా అమలవుతుందని ఆశిస్తున్నాం.
– సంధ్యపాగ గోపాల్, పీఆర్టీయూ టీఎస్ మండల గౌరవాధ్యక్షుడు, కొత్తకోట
మోదీని ఎదుర్కొనేది కేసీఆర్ ఒక్కడే..
పీఎం మోదీని ఎదుర్కొనే సత్తా దేశంలో ఒ క్క కేసీఆర్కు మాత్రమే ఉన్నది. దేశంలోనే రా ష్ర్టాన్ని మొదటి స్థానంలో నిలిపిన కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే అన్ని రాష్ర్టాలు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉన్నది. దేశ రాజకీయాలపై ఆ యనకు అవగాహన ఉన్నది. తలసరి ఆదాయా న్ని పెంచి అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేశాడు. అన్ని రాష్ర్టాల నేతలతో సమాలోచన చేసి ఏకతాటిపై తీసుకురాగల మ హోన్నత నేత కేసీఆర్. వ్యవసాయం దండగ అనే నానుడి నుంచి పం డుగ అనే వాతావరణం తీసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలకు సరిపడా ఆహార ధాన్యాలు పండించాలన్నా.., ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాలన్నా కేసీఆర్ విజన్ కావాలి. కేసీఆర్ లాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోకి వస్తే అన్ని రంగాలు పురోగాభివృద్ధి సాధిస్తాయి.
– అటకేసరి వెంకటేశ్వరరావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అలంపూర్
రాజకీయాలను శాసించే నేత..
రాష్ట్ర రాజకీయాలను శాసించే కేసీఆర్.. జా తీయ స్థాయిలోకి వెళ్లి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారనే నమ్మకం అందరికీ ఉన్నది. దేశ రాజకీయాల్లోకి వెళ్తే ఆయనకెంత మంచి జరుగుతుందో తెలియదు కానీ.., రాష్ట్ర ప్రజలకు మా త్రం రెట్టింపు మంచి జరుగుతుంది. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపించే కేసీఆర్.. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతాడు. అనుకున్నది సాధించడానికి ముక్కుసూటిగా ప్రశ్నించడం అత ని తత్వం. ఎన్నో ప్రకృతి వనరులు ఉన్న దేశాన్ని అతి తక్కువ కా లంలో ప్రపంచ దేశాలు సైతం మన వైపు చూసేలా చేస్తారన్న విశ్వాసం ఉన్నది. దేశ రాజకీయాల్లోకి రావాలనుకోవడం అన్ని రాష్ర్టాలకు శుభపరిణామం. – అయ్యస్వామి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, చాగదోణ
భవిష్యత్కు పునాది వేయాలి..
వ్యవసాయ రంగంలో ప్రపంచంలోనే ఎం తో పేరు ప్రతిష్టలున్న దేశానికి పూర్వవైభవం రావాలంటే కేసీఆర్ సర్కార్ చేపడుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఉత్తరాది రాష్ర్టాల ఆధిపత్య పోరును అధిగమించేందుకు ఉద్యమస్ఫూర్తి ఉన్న కేసీఆర్ నాయక త్వం కావాలి. ఇది దక్షిణాది రాష్ర్టాలకు మాత్ర మే కాకుండా.. దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందాలి. మిషన్ కాకతీయ, మి షన్ భగీరథ, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు రైతన్నలకు భరోసా కల్పించాయి. అన్నదాతలు ఆర్థికంగా నిలదొక్కుకొని ఆత్మాభిమానంతో బతుకుతున్నారు. మన ఊరు- మన బడితో ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి విద్యారంగం లో భవిష్యత్కు పునాది వేయాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. – శ్రీనివాస్రెడ్డి, ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారి, వీపనగండ్ల
విప్లవాత్మక మార్పులు వస్తాయి..
కేసీఆర్ పీఎం అయితే దేశంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకోవడం శుభపరిణామం. బీజేపీ అధికారంలోకి వచ్చాక మోదీ సర్కార్ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నది. జీఎస్టీ, నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోనే తెలంగాణను సక్సెస్ఫుల్ మోడల్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఇలాంటి కేసీఆర్ దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పడం ఖాయం.
– ఎం.వెంకటయ్య, ఉపాధ్యాయుడు, కదిరేపాడు
ఇది మంచి ఆలోచన..
ఎంతో కష్టపడి పోరాడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ జాతీ య రాజకీయాల్లోకి వెళ్లాలనుకునే ఆలోచన మంచిదే. ఉద్యమ నాయకుడిగా ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్. రా ష్ట్ర వికాసంలో ఆయన చూపుతున్న శ్రద్ధ, దర్శనికత, వ్యవసాయ, విద్యుత్ రంగాల్లో సాధించిన అద్భుత ప్రగతి హర్షణీయం. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేయడం, ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధికి మన ఊరు- మనబడి పథకం వంటి ఆలోచనలు దేశ నాయకులు చేసేలా ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే సత్తా ఆయనకే ఉన్నది. – సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యాయుడు, నాగర్కర్నూల్
జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నాం..
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం శుభపరిణామం. ఎనిమిదేండ్లలో తెలంగాణ ఎలా అభివృద్ధి సాధించిందో.. దేశ రాజకీయాల్లోకి వస్తే దేశం కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతుంది. బీజేపీ ప్రభుత్వం గుజరాత్ను రోల్మోడల్గా చూపిస్తున్నది. ఆ రాష్ర్టాన్ని పొగుడ్తున్నది. ఆ రాష్ట్రం కన్నా వెయ్యి రెట్లు తెలంగాణలో అభివృద్ధి జరిగింది. మనలను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సీఎం కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నాం. మా సంపూర్ణ మద్దతు ఆయనకే ఉంటుంది.
– రాజీవ్రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు, మహబూబ్నగర్
ప్రత్నామ్నాయ పార్టీగా అవతరిస్తుంది..
ప్రస్తుతం దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. కేసీఆర్ పెట్టబోయే పార్టీ జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ పార్టీగా అవతరిస్తుంది. దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నది. 28 రాష్ర్టాల్లో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఎనిమిదేండ్లలో రాష్ట్రం కనీవినీ ఎరుగని అభివృద్ధి సాధించింది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడితే దేశం కూడా ఇదే తరహాలో అభివృద్ధి చెందుతుంది. అందుకే జాతీయ స్థాయిలో కేసీఆర్ను ప్రత్నామ్నాయ రాజకీయవేత్తగా చూస్తున్నారు.
– రాజగోపాల్, టీజీవో అధ్యక్షుడు, మహబూబ్నగర్
యుగ పురుషుడు కేసీఆర్
తెలంగాణ రాష్ర్టాన్ని ఒక్కడే ఏం సాధిస్తాడులే అన్న వారే.. ఇప్పుడు సీఎం కేసీఆర్కు జేజేలు పలుకుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో పేదల బ తుకులు మారాయి. 2019లో నేను గ్రూప్-4లో ఉత్తీర్ణత సాధించి పం చాయతీ సెక్రటరీగా విధుల్లో చేరా ను. నా లాంటి వారెందరికో ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్ర తలరాత మార్చేందుకు పుట్టిన యుగ పురుషుడు సీఎం కేసీఆర్. యావత్ భారతదేశం అన్నిరంగాలలో అభివృద్ది చెంది, యువతకు, రైతాంగాన్ని మంచి జరగాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగు పెట్టాలి. ఆయనకు మా సహచరులంతా కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం.
– శిరీష, పంచాయతీ సెక్రటరీ, రామన్పాడు
కేసీఆర్ విజన్ దేశవ్యాప్తం కావాలి..
ఉద్యమానికి పాలమూరు జిల్లా అండగా ని లిచినందుకు సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. కాళేశ్వ రం బాహుబలి-1 అయితే.., పీఆర్ఎల్ఐ ప్రా జెక్టు బాహుబలి-2గా చరిత్రలో నిలవనున్నది. దేశ చరిత్రలో లేని విధంగా రెండు భారీ ప్రాజెక్టులతో సీఎం కేసీఆర్ నీటి పారుదల విషయం లో తన ప్రత్యేకత చాటుకొన్నారు. కాళేశ్వరం ప్రారంభమైంది. త్వరలో పాలమూరు ఎత్తిపోతల పూర్తవుతుంది. ఇలా నీళ్లతో వచ్చిన మార్పుతో గ్రామాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి చెందాయి. బీడు భూముల్లోనూ వరి, వేరుశనగ వంటి ధనరాశులు పండుతున్నాయి. మిషన్ భగీరథతో తాగునీటి సమస్య శాశ్వతంగా తీరింది. ప్రజల్లో కొనుగోలు శక్తి సామర్థ్యాలు పెరిగాయి. దీనికి సీఎం కేసీఆర్ నీటి విజనే ప్రధానంగా చెప్పొచ్చు. ఎన్ని వనరులు ఉన్నా నీళ్లు లేకుంటే వ్యవసాయంతోపాటు పరిశ్రమలూ అభివృద్ధి చెందలేవు. దేశంలో ఈ రెండూ ముందుకు సాగాలంటే సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలి. సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపు ఉన్న నాయకుడు. ఇంజిననీర్ లాంటి నైపుణ్యం ఉన్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకోవడం చాలా మంచి నిర్ణయం. ఇది దేశ ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తుంది.
– సత్యనారాయణగౌడ్, డీఈ, నీటిపారుదల శాఖ
మోదీకి బుద్ధి చెప్పాలి..
దేశం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. పేదల ఇక్కట్లు తొలగాలంటే బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ ఉండాలి. మోదీ పాలనలో దేశం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజల బాధలు వర్ణణాతీతం. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశమంతా అమలయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నది. కేసీఆర్ జాతీయ పార్టీ తప్పక పెట్టాలి. ప్రశ్నించే గొంతు లేక మోదీ ఇష్టారీతిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం కేసీఆర్. – నర్సింహ, విద్యుత్ ఉద్యోగి, గద్వాల
ప్రశ్నించే గొంతు కావాలి..
దేశంలో మార్పు రావాలంటే కొత్త నాయక త్వం అవసరం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. బీజేపీ సర్కార్ను ప్రశ్నించే గొం తు కావాలి. దేశానికి మతవాదులు కాదు.. లౌ కికవాదులు అవసరం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే దేశంలో లౌకికవాదం ఏర్పడుతుంది. ఆయన వల్లే నదుల అనుసంధానం అవుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. అందుకే చాలా రాష్ర్టాల్లో రైతు ఉద్యమాలు జరిగాయి. కేజీ టు పీజీ విద్యావిధానాన్ని దేశంలో అమలుపరిచే సత్తా ఒక్క కేసీఆర్కు మాత్రమే ఉన్నది. – కావలి మణ్యం, ప్రభుత్వ ఉద్యోగి
కేసీఆర్ పీఎం కావాలి..
రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ను ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న బడుగు, బలహీన వర్గాల వా రు అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. 60 ఏండ్ల తెలంగాణ రాష్ట్ర కలను 14 ఏండ్లు అలుపెరుగని ఉద్యమం చేసి సాధించా రు. దేశ ప్రజల కోసం కేసీఆర్ మరోసారి ఉద్యమం చేయాలి. అందు కు అనువైన సమయం మొదలైంది. దేశ ప్రగతి కోసం ప్రాంతీయ పా ర్టీలను ఏకం చేయాలి. కేసీఆర్ పీఎం కావాలి. – కావలి వెంకటయ్య,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు, జెడ్పీ బాలుర పాఠశాల, ఆత్మకూర్
సర్వత్రా హర్షణీయం..
తెలుగు నేల నుంచి దేశ రాజకీయాల్లోకి అనేక మంది వెళ్లారు. అయినప్పటటికీ మనకంటూ ఒక స్పష్టమైన ముద్ర వేయలేకపోయారు. ఇలాంటి సమయంలోనే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అరంగేట్రం చేయడం సర్వత్రా హర్షణీయం. మనకంటూ ఒక స్పష్టమైన ముద్ర వేయాల్సిన నాయకుడు దేశ రాజకీయాల్లో ఉండాల్సిందే. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఆయన వల్లే దేశ రాజకీయాలు మారుతాయి.
– శివకుమార్, ఉపాధ్యాయుడు, బిజినేపల్లి