కోయిలకొండ, అక్టోబర్ 27 : ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే మోసగాళ్లను నమ్మితే గోసపడుతామని, అభివృద్ధిని చూసి ప్రజలు ఆదరించాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలో ని మణికొండ, పెర్కివీడు, పెర్కివీడుతం డా, కేశ్వాపూర్, చందాపూర్, అయ్యవారిపల్లి, అంకిళ్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెసోళ్లు రైతులకు 3గంటల కరెంటు ఇస్తే సరిపోతదని చె బుతున్నారని, రైతుల బాధలు తెలియని వారికి అధికారమిస్తే మనమంతా చీకట్లో మగ్గాల్సిన దుస్థితి నెలకొంటుందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు ఇచ్చి అన్ని విధాలుగా అండగా నిలబడుతున్నారని తెలిపారు. అభివృద్ధి కోసం ప్రజలు మరోసారి కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం మండలంలో ని ఇబ్రహీంనగర్కు చెందిన కాంగ్రెస్, బీ జేపీ పార్టీల నాయకులు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చే రారు. అలాగే మండలంలోని కేశ్వాపూర్ ఉపర్పంచ్ రవినాయక్ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో నారాయణపేట సమన్వయకర్త రవీందర్రెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, నాయకులు మొగులయ్య, రాఘవేందర్రెడ్డి, సతీశ్, శ్రీధర్, కిశోర్, మ హేశ్, బీమయ్య, సురేశ్రావు, రవి తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ, అక్టోబర్ 27 : సీఎం కేసీఆర్ సారు వొచ్చినంకనే మాకు మంచిగైంది. మా బిడ్డలు పట్టించుకోకున్నా పింఛన్ పైసలతో చింతలేకుండా బతుకుతు న్నాం. కాంగ్రెసోళ్లు వొ స్తే మా పింఛన్ మళ్లా రూ.300 అయితది. మా బతుకులు ఆగమైతయి. కేసీఆర్ సారు మళ్లీ రావాలె బిడ్డా అంటూ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డికి వృద్ధ దంపతులు కం చిమి బాలప్ప, పార్వతమ్మ చెప్పారు. మండలంలోని మణికొండ ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేతో వారు ముచ్చటించారు. కారు గుర్తుకే ఓటేస్తామని తమ మద్దతు తెలిపారు.