వనపర్తి, జనవరి 17 : వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత భవనంలో కలెక్టర్ తేజస్నందలాల్పవార్, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, వాకిటి శ్రీహరి, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూ పల్లి మాట్లాడుతూ ఎండాకాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని సూచించారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చాలా గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకు మి షన్ భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. ఏజెన్సీకి మిషన్ భగీరథ బిల్లులు ఇచ్చే ముందు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులతోపాటు గ్రామ మహిళా సంఘాల అధ్యక్షుల సంతకాలు సైతం తీసుకోవాలని సూచించా రు. పది రోజుల తరువాత మరోసారి సమీక్ష నిర్వహిస్తామని.. ఆలోగా వాస్తవ నివేదికలు తయారు చేసి ఇ వ్వాలని ఆదేశించారు. గనులు, భూగర్భ శాఖకు సం బంధించిన మైన్స్, ఖనిజాలు ఎక్కడ వినియోగించారో, వాటి ఆదాయం ఎంతో పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పారు. అధికారులు తమ పనితీరు మెరుగుపర్చుకొ ని ప్రజల నుంచి ప్రశంసలు పొందాలన్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా, సర్కారు భూములు క బ్జా కాకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నా రు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఆలోచనా విధానం, పని తీరు, బాధ్యతలు నిర్వర్తించడంలో స్పష్టమైన మార్పు కనబడాలన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజాసేవకులు అనే విషయాన్ని గుర్తించాలన్నారు. స మస్యలు విన్నంచుకోవడానికి వచ్చిన ప్రజలతో మర్యాదగా మసులుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గత ప్ర భుత్వ హయాంలో చేపట్టిన అన్ని రకాల పనులను తి రిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జూరాల కుడి కాల్వ నుంచి యథావిధిగా సాగునీరు పారుతుందని.., ఎడమ కాల్వకు మా త్రం ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. మక్తల్ నియోజకవర్గంలో ప్రస్తుత పంటకు కనీసం రెండు తడులకు సా గునీరందించేలా అధికారులను ఆదేశించాలని మంత్రి ని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ ధరణిలో ఇప్పటివర కు 26,900 దరఖాస్తులు వచ్చాయని.. అందులో 23 వేలకు పైగా దరఖాస్తులను పరిష్కరించామని, 3,500 పెండింగ్లో ఉన్నాయని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తిరుపతిరావు, ఏఎస్పీ తేజావత్ రాందాస్, ఆర్డీవో పద్మావతి, అధికారులు పాల్గొన్నారు.