నారాయణపేట టౌన్, నవంబర్ 24 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల ని ర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయంలో రా ష్ట్ర ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్, ప్రత్యేక కార్యదర్శి సు నీల్శర్మతో కలిసి గురువారం వీసీ నుంచి జిల్లాల కలెక్టర్లు, రోడ్డు, భవనాల శాఖ అధికారులతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, పోడు భూములు, క్రీడా ప్రాంగణాలు, బృహత్ ప్రకృతి వనాలు, ధరణి తదితర అంశాలపై సమీక్షా స మావేశం నిర్వహించారు.
కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో 2017 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకోగా 900 ఇం డ్లకు టెండర్లు పూర్తయ్యాయని, 360 ఇండ్ల నిర్మాణాలు వి విధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. 336 తెలంగాణ క్రీ డా ప్రాంగణాలను లక్ష్యంగా పెట్టుకోగా 301 పూర్తయ్యాయని, 55 బృహత్ ప్రకృతి వనాలను లక్ష్యంగా పెట్టుకోగా 45 పూర్తయ్యాయన్నారు. జిల్లాలో పోడు భూముల కు సంబంధించి 377 దరఖాస్తులు వ చ్చాయని, వాటి సర్వే పూర్తి చేయడం తోపాటు గ్రామసభలు నిర్వహించినట్లు తెలిపారు. సబ్ కమిటీ, జిల్లాస్థా యి కమిటీలు పరిశీలించి గడువు లో పు ప్రభుత్వానికి పంపిస్తామని ఆయ న తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్లు పద్మజారాణి, మయాంక్ మిట్టల్, డీ ఆర్డీవో గోపాల్నాయక్, ఆర్డీవో రాంచందర్నాయక్, పీఆర్ ఈఈ నరేందర్ పాల్గొన్నారు.
కోస్గి మండలంలో శనివారం నిర్వహించాల్సిన ప్రత్యేక ప్రజావాణిని వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష గురువారం ప్రకటనలో తెలిపారు. వివిధ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కారణంగా తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.