నారాయణపేట, అక్టోబర్ 27: సీఎం కేసీఆర్ నేతృ త్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నదని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 1వ వార్డులో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత 60 ఏండ్ల లో కాంగ్రెస్ హయాంలో జరగని అభివృద్ధి 9 ఏండ్లల్లో జరిగిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధ్దిని వివరిస్తూ మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జగదీశ్, మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు చంద్రకాంత్, శివరాంరెడ్డి, సరాఫ్నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, అక్టోబర్ 27: పట్టణంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి చేపట్టిన అభివృద్ధ్దిని చూసి మరోసారి గెలిపించాలని 18వ వార్డు కౌన్సిలర్ గురు లిం గం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్తీక్ అన్నారు. పట్టణంలోని 7, 12, 18 తదితర వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఓటర్లకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్రెడ్డికి ఓటు వేసి హ్యాట్రిక్ విజయం అందించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నారాయణపేటరూరల్, అక్టోబర్ 27: పేట మండలంలోని కొల్లంపల్లి, వందర్గుట్టతండాలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రతి ఇంటికీ తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఎస్.రాజేందర్రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వేపూరి రాములు, రవీందర్గౌడ్, రైతు బం ధు సమితి జిల్లా సభ్యుడు కోట్ల జగన్మోహన్రెడ్డి, మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు అలీశేర్, సర్పంచులు సాయిరెడ్డి, కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు.
మరికల్, అక్టోబర్ 27: ముఖ్యమంత్రి కేసీఆర్ పేద కుటుంబానికి భరోసా కల్పించేందుకే కేసీఆర్ బీమా పథకం ప్రకటించారని జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, మరికల్ సర్పంచ్ గోవర్ధన్ అన్నారు. శుక్రవారం వారు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మ్యానిపెస్టోపై ఇంటిటి ప్రచారం నిర్వహించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు రైతుబీమా కల్పించినట్ల్లే తెల్లరేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా ఆసరాగా నిలు స్తుందన్నారు. రాబోవు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మరోసారి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోపాల్, ఉప సర్పంచ్ శివకుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతయ్య, నాయకులు హన్మిరెడ్డి, రామస్వామి, బసంత్, శ్రీనివాసులు, బీఆర్ఎస్ యుత్ మండల అధ్యక్షుడు గొల్ల రాజేశ్యాదవ్, మండల కోఆప్షన్ సభ్యులు మతీన్, జగదీశ్, ఉప సర్పంచ్ శివకుమార్, గొల్ల ఆంజనేయులు, కొండారెడ్డి, సుధాకార్గౌడ్, మాసన్న, మల్లేశ్, ఎల్.రా ములు, సత్తార్, గూప నర్సింహులు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ, అక్టోబర్ 26 : రాష్ట్రంలో అమలౌతున్న సం క్షేమ పథకాలు కొనసాగాంలంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు కోరా రు. శుక్రవారం మండలంలోని గున్మక్ల, కొండ్రోనిపల్లిగ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు మ్యానిపెస్టోపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేట నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుధీర్కుమార్రావు, నాయకులు రమేశ్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బాలయ్యగౌడ్, బాలరాజు, ప్రతాప్రెడ్డి, బాలయ్యగౌడ్, హుసేన్ తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద, అక్టోబర్ 27: మండంలోని కంసాన్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కంసాన్పల్లి గ్రామంలో జరిగిన అభివృధ్ధి పనుల గురించి గడపగడపకు తిరిగి వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి ఎస్. రాజేందర్రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాంచందర్గౌడ్, మధుకుమార్ గౌడ్, గ్రామ యువకులు పాల్గొన్నారు.