తల్లిదండ్రులు, అధికారులు, ఉపాధ్యాయులు యువతలో దాగిఉన్న ప్రతిభను వెలికితీయాలని ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో బుధవారం జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 9, 10వ తేదీల్లో మహబూబ్నగర్లో రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు నిర్వహిస్తామని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 1500 మంది కళాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. అంతకుముందు మహబూబ్నగర్ షాషాబ్గుట్ట నుంచి మర్లు, బైపాస్రోడ్డు వరకు రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డుకు శంకుస్థాపన చేశారు. మినీ ట్యాంక్బండ్ వద్ద జరుగుతున్న నెక్లెస్రోడ్డు పనులను తనిఖీ చేశారు.
మహబూబ్నగర్టౌన్, జనవరి 4 : తల్లిదండ్రులు, అధికారులు యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేయాలని ఎక్సైజ్, యువజన సర్వీసులశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో బుధవారం జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కళలు, ప్రాచీన సంప్రదాయ కళారూపాలు ఆయా ప్రాంతాల గొప్పతనాన్ని తెలియజేస్తాయన్నారు. బీఆర్ఎస్ సర్కా ర్ సంస్కృతి, సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. యువత దేశానికి వెన్నెముక అని, దేశాభివృద్ధిలో ముఖ్యభూమిక పోషించాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా చెడుమార్గంలో పయనించకుండా ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలపై దృష్టి సారించాలన్నారు. అలాగే క్రీడల్లో రాణించాలని సూచించారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతోపాటు కళలను ప్రోత్సహించడంలో భాగంగా 9, 10 తేదీల్లో మహబూబ్నగర్లో రాష్ట్రస్థాయి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉత్సవాలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సూమారు 1500 మంది కళాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. కళాశాలలు, పాఠశాలల నుంచి విద్యార్థులను యువజన ఉత్సవాలకు పంపించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీవైఎస్వో శ్రీనివాస్, కౌన్సిలర్లు రామ్లక్ష్మణ్, గోవిందు, నరేందర్, సిబ్బంది విజయ్కుమార్ పాల్గొన్నారు.
పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
మహబూబ్నగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని షాషాబ్గుట్ట నుంచి మర్లు మీదుగా బైపాస్రోడ్డువరకు రూ.10లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మినీ ట్యాంక్బండ్ నెక్లెస్రోడ్డు పనులను పరిశీలించారు. అలాగే కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోట్ల రూపాయలు వెచ్చించి మినీ ట్యాంక్బండ్ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. నక్లెస్రోడ్డు, సస్పెన్షన్ బ్రిడ్జి, శిల్పారామం వంటి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. పట్టణ ప్రజలు వాకింగ్ చేసేందుకు ట్రాక్ ఏర్పాటు చేశామన్నారు. పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ము న్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ క మిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్లు మ స్రత్ ముంజిమిల్, షబ్బీర్, నాయకులు జహంగీర్, అంజద్, నవకాంత్, జాఫర్షా, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్చరీ క్రీడాకారులకు అభినందన
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో జిల్లా క్రీడాకారులు రోషణ్, చంద్రనీల్, రితీక్, శ్రీహిత, సనిబా, సదిక్ష బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయి పొటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలో క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆర్చరీ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయస్థాయి టోర్నీలో ప్రతిభ చాటి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీవైఎస్వో శ్రీనివాస్, కోచ్ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
నేషనల్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభం
మహబూబ్నగర్ అర్బన్, జనవరి 4 : జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన నేషనల్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన లండన్ బ్రిడ్జి, ఈఫిల్ టవర్, బుర్జ్ ఖలీఫా, యూనివర్సల్ స్టూడియో, దుబాయ్ సిటీ హోటల్, బ్రోకెన్ బిల్డింగ్లను పరిశీలించారు. విశాలమైన మైదానంలో ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, కౌన్సిలర్ రాణీరాజు, నూర్ మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి పాలిటెక్నిక్ స్పోర్ట్ మీట్
ప్రారంభించనున్న మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్టౌన్, జనవరి 4 : రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆదేశాల మేరకు గురువారం నుంచి మహబూబ్నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉమ్మడి జిల్లాస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్ మీట్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ నాగరాజు బు ధవారం ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 11 కళాశాలలు పాల్గొంటాయని పేర్కొన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయని, రెండురోజులపాటు నిర్వహించే టోర్నీకి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోటీలను క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు.