దేశంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదే అని, ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉప్పునుంతల మండలంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వ హించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ పట్నం, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నుంచి పార్టీని ఎవరూ వేరు చేయలేరన్నారు.
ఉప్పునుంతల, ఏప్రిల్ 17 : దేశంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదేనని, ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని వెల్టూర్ గేట్ సమీపంలో ఉన్న ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్రావు అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ పట్నం, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల నుంచి పుట్టి ప్రజల గుండెల్లో నిలిచిందన్నారు. ప్రజల నుంచి పార్టీని ఎవ్వరూ దూరం చేయలేరన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న విప్ గువ్వలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు.
వచ్చే సారి మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర ఉచిత విద్యుత్, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. విప్ గువ్వల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. ప్రాణం ఉన్నంతవరకు ప్రజలను మరిచిపోనని, తన జీవితం ప్రజాసేవకే అంకితం చేశానన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానన్నారు. సీఎంతో మాట్లాడి అన్యాయమైన తూర్పు గ్రామాలకు ఎంజీకేఎల్ఐ నీళ్లు రావడానికి ఎంతో కృషి చేశానని, త్వరలోనే పనులు పూర్తి కానున్నాయన్నారు. మరో 10 వేల ఎకరాలకు సాగునీరందనున్నదన్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మహిళల కృషి అభినందనీయమని, ఇక నుంచి పార్టీ పరంగా జరిగే కార్యక్రమాలకు తమ భార్యలను తప్పనిసరిగా తీసుకురావాలని నాయకులకు సూచించారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరున పలకరించి యోగక్షేమాలను అడిగితెలుసుకున్నారు. పెనిమిళ్ల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మండలంలోని తాడూర్ గ్రామానికి చెందిన వందమంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ పట్నం, విప్ గువ్వల గులాబీ కండువాలు కప్పారు. పార్టీలో చేరిన వారిలో బురాన్, బాల్చేరి, జహంగీర్, బాలరాజు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రతాప్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ భూపాల్రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, సర్పంచులు బాలునాయక్, మల్లేశ్, రమేశ్రెడ్డి, లింగం, అలివేల, శివ, వెంకటయ్య, ఎంపీటీసీ మల్లేశ్, నాయకులు పద్మనాభరెడ్డి, చంద్రమౌళి, నాగయ్యగౌడ్, లింగమయ్య, సుల్తాన్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.