జడ్చర్ల, మార్చి 25 : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కా ర్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని, నిరంతరం ప్రజలమధ్యే ఉంటూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు. శనివారం జడ్చర్లలోని చంద్రాగార్డెన్స్ లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కశిరెడ్డి, ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఏప్రిల్ 2 నుంచి 10వ తేదీ తొమ్మిది ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న మామిడితోటలో ఏప్రిల్ 2న బాలానగర్, 3న నవాబ్పేట-1, 4న జడ్చర్ల-1, 5న జడ్చర్ల మున్సిపాలిటీ, 6న నవాబ్పేట-2, 7న జడ్చర్ల-2, 8న రాజాపూర్ మండలాల నాయకుల తో సమావేశాలు ఉంటాయన్నారు.
9న మిడ్జిల్, 10 న ఉర్కొండ మండలకేంద్రాల్లో సమ్మేళనాలు ఏర్పా టు చేయనున్నట్లు వివరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై గ్రామాల్లో చ ర్చ పెట్టాలన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు గందరగోళానికి గురిచేస్తాయన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో వంద ఏండ్లకు సంబంధించి ప్రణాళికలు రూపొందించారన్నారు. త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేసి ని యోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. క ర్వెన రిజర్వాయర్ దాదాపు 90 శాతం పూర్తయింద ని, ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. ప్రతిపక్షాలు రిజర్వాయర్లను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వే స్తున్నాయన్నారు.
బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. పేపర్లీకే జీ దురదృష్టకరమని, ఎంక్వయిరీ కమిటీ వేశామ న్నారు. అదానీ లక్షల కోట్ల స్కాం చేసినా విచారణ చే యడం లేదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారంగా ఎకరాకు రూ.10 వేలు చెల్లిస్తామన్నారు. దీనిపై కూడా బీజేపీ రా జకీయం చేస్తున్నదని, వారికి చేతనైతే పార్టీ పెద్దలతో మాట్లాడి కేంద్రం నుంచి మరో రూ.10వేలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, నర్సింహులు, మాజీ చైర్మన్ లక్ష్మయ్య, ముడా డైరెక్టర్లు ఇమ్మూ, శ్రీకాంత్, కౌన్సిలర్లు సారిక, ఉమాశంకర్గౌడ్, ప్రశాంత్రెడ్డి, లత, పుష్పలత, చైతన్య, నవనీత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, టౌన్ అధ్యక్షుడు మురళి, ప్ర జాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.