వెల్దండ, జూలై 10 : గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో చౌదర్పల్లి, రాఘాయిపల్లి గ్రామాల లబ్ధిదారులకు రెండో విడుత గొర్రెలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొలి విడుతలో కల్వకుర్తిలో 6 వేల మంది గొర్రెల కాపరులు లబ్ధి పొందారన్నారు. రెండో విడుతలో ప్రతి యూనిట్కు రూ.1.75 లక్షలతో 19 గొర్రెలు, ఒక పొట్టేలు అందజేస్తున్నామన్నారు.
దేశంలో ఎక్క డా లేని విధంగా గొర్రెలు పంపిణీ చేసి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. పేదలను కడుపు లో పెట్టుకొని చూసుకుంటామన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ జేవీ రమేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండీ అలీ, ఎంపీడీవో శ్రీనివాస్, మండల పశువైద్యాధికారి శ్యాంసుందర్, సర్పంచులు గాలమ్మ, అచ్చాలు, భక్యానాయక్, సింగిల్విండో డైరెక్టర్ నాగులునాయక్, రాచూర్ ఎంపీటీసీ వెంకటయ్య, నాయకులు ఆనంద్రెడ్డి, వెంకటయ్య, బాలు, శ్రీను, కొండల్యాదవ్, కొండల్ తదితరులు పాల్గొన్నారు.