మహబూబ్నగర్ అర్బన్, సెప్టెంబర్ 12 : పీఆర్ఎల్ఐ మోటర్లను ఆన్చేయగానే సమైక్య పాలనలో ఉమ్మడి జిల్లాకు పట్టిన దరిద్రమంతా పోతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో మహబూబ్నగర్ మున్సిపల్, అర్బన్ పరిధిలోని 346 మంది లబ్ధిదారులకు మంగళవారం రూ.3.5 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ చేతులమీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల మోటర్లను ఆన్ చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆడపిల్లల పెండిండ్లకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఇచ్చిన ప్రతిసారీ 300 నుంచి 500 మందికి చెక్కులను పంపణీ చేస్తున్నామన్నారు.
ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందిన వారికి సీఎం సహాయనిధితో అండగా నిలుస్తున్నామన్నారు. పేదలకు స్థానికంగానే వైద్య సేవలందించేందుకు వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. మన్యంకొండ వద్ద తెలంగాణలోనే మొట్టమొదటి రోప్వే నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం శిల్పారామం ఉన్న స్థలంలో చెత్తకుప్పలు ఉండేవని, నేడు ట్యాంక్బండ్, సస్పెన్షన్ బ్రిడ్జి, నెక్లెస్ రోడ్డుతో కొత్తరూపు వచ్చిందన్నారు. భూత్పూర్ నుంచి చిన్నదర్పల్లి వరకు బైపాస్రోడ్డు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్నయాదవ్, ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, అర్బన్ తాసిల్దార్ నాగార్జున, రాజగోపాల్, కౌన్సిలర్ గోవింద్, అనంత్రెడ్డి, నర్సింహులు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో ఉంటే పాపం చేసినట్లేనని భావించి కార్యకర్తలంతా బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ మైనార్టీ నాయకులు జహంగీర్, రహీం, ఫారుఖ్, రబియాబేగం, ఫాతిమా, షబ్బీర్, రషీద్, ఫెరోజ్, షాబుద్దీన్, నిరంజన్, బాలు, కృష్ణతోపాటు 100 మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కులమతాలకతీతంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నదన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. అనంతరం హన్వాడ మండలంలోని గుండ్యాల స్టేజీ నుంచి కొమిరెడ్డిపల్లి గ్రామం మీదుగా షేక్పల్లి వరకు నిర్మించనున్న బీటీరోడ్డుకు రూ.10 కోట్లు కేటాయించిన జీవో కాపీని ప్రజాప్రతినిధులకు అందజేశారు. అలాగే స్వర్ణకార కుటుంబాల సమగ్ర సర్వే బుక్కును మంత్రి ఆవిష్కరించారు. పేద స్వర్ణకారులను గుర్తించి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, హన్వాడ ఎంపీపీ బాలరాజు, రమణారెడ్డి, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖరాచారి, పట్టణ అధ్యక్షుడు రామాచారి, గోవర్ధన్, బ్రహ్మాచారి తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు, సెప్టెంబర్ 12 : గురువులు తల్లిదండ్రు లతో సమానమని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జి ల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ చిన్నారులను భావిభారత పౌరులుగా తీర్చిది ద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదన్నారు. అసోసియేషన్ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ భవనానికి 500 గజాలు, నిర్మాణానికి రూ.20లక్ష లు కేటాయిస్తామన్నారు. అనంతరం మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ప్రభాకర్, సంగీత, నాటక రంగ అకాడమీ మాజీ చైర్మన్ బా ద్మి శివకుమార్, పీపీ జనార్దన్, బీఆర్ఎస్ నాయకులు ఇమ్రాన్, సత్యంయాదవ్ పాల్గొన్నారు.