భూత్పూర్, ఆగస్టు 27 : సంక్షేమ పథకాలతో దేశంలోనే నెంబర్వన్గా తెలంగాణ దూసుకెళ్తున్నదని ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పాతమొల్గరలో లబ్ధిదారులకు కొత్త పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ చరిత్రలోనే 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తున్న ఘ నత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రధాని మోదీ ఉచిత పథకాలను ఎత్తివేయాలని ప్రణాళికలు తయారు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉచిత పథకాలను ఎత్తేస్తే రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు నిలిచిపోతాయన్నారు.
తెలంగాణ రాకముం దు రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉండే, ఇప్పుడెలా ఉన్నాయో బేరీజు వేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో 47 వేల మందికి పింఛన్లు అందస్తున్నట్లు తెలిపారు. కాం గ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయంతో మండలంలోని మద్దిగట్ల, వెల్కిచర్ల, పాతమొల్గర, కప్పెట గ్రామాలు సాగు, తాగునీటికి నోచుకోలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏ ర్పడ్డాక రూ.110 కోట్లతో మంగనూరు నుంచి కాల్వ తీసి సాగునీరు అందిస్తుండడంతో నేడు సస్యశ్యామలంగా మారాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, స్పెషలాఫీసర్ సాయిబాబా, తాసిల్దార్ చెన్నకిష్టన్న, ఎంపీడీవో మున్నీ, వైస్ ఎంపీపీ నరేశ్గౌడ్, ఎంపీవో విజయకుమార్, పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్, సర్పంచ్ సుజాతమ్మ, మత్స్య సహకార సంఘం ఇన్చార్జి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.