నారాయణపేట టౌన్, మార్చి 4: ఐదేండ్లలోపు చిన్నారులందరికీ తప్పకుండా పో లి యో చుక్కలు వేయించాలని ఎన్సీడీ(నాన్ కమ్యూనకబుల్ డిసీజెస్) స్టేట్ మానిటరింగ్ అ ధికారి వినయ్సింగ్, డీఐవో శైలజ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ మండలాల్లో ఇంటింటి పల్స్ పోలియో కార్యక్రమాన్ని వారు తనిఖీ చేశారు. దామరగిద్ద మండలంలోని క్యా తన్పల్లి, ఊట్కూర్, గుండుమాల్లో కార్యక్రమాన్ని సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో బృందాలు ఎంత మంది చిన్నారులకు పోలి యో చుక్కలు వేశారో ఆరా తీశారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఈవో గోవిందరాజు,వైద్యాధికారిణి కిష్టమ్మ ఉన్నారు.
దేవరకద్ర, మార్చి 4 : మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం రెండో రోజు పల్స్ పోలియో చుక్కల మందుల పంపిణీ కొనసాంది. ఆయా గ్రామా ల్లో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామంలోని ఇంటింటికీ తిరిగి జీరో నుంచి ఐ దు సంవత్సరాల్లోపు చిన్నారులను గుర్తించి పో లియో చుక్కలు వేశామని, మంగళవారం కూ డా ఇంటింటికీ తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తామని ప్రాథమిక వైద్యుడు శరత్చంద్ర తెలిపారు.
మిడ్జిల్, మార్చి 4: పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని డాక్టర్ శివకాంత్ అన్నా రు. మండలంలోని 98 శాతం వేసినట్లు తెలిపారు. సోమవారం గ్రామాల్లో వైద్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ చిన్నారులకు పోలియో చుక్కలు వేశా రు. కార్యక్రమంలో డాక్టర్ కృష్ణకుమార్, వైద్యసిబ్బంది మరియమ్మ, దేవయ్య, జంగయ్య, సంపత్కుమార్, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు సిబ్బంది ఉన్నారు.