అలంపూర్, మే 17 : డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వల్ల నీటి చౌర్యం ఏర్పడి ఉమ్మడి పాలమూరు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర సాధన మలి దశ ఉద్యమకారుల నియోజకవర్గ జెఏసీ చైర్మన్ షేక్ హు సేన్ వలీ డిమాండ్ చేశారు. ఈ విషయంపై అలంపూర్ ఎమ్మె ల్యే విజయుడును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి పథకం పనులు వెంటనే పూర్తి చేసి జాతీయహోదా కల్పించాలన్నారు. పీఎల్ఆర్ఐను పూర్తి చేస్తే ఉమ్మడి పాలమూరు రైతులకు సాగునీటికి ఢోకా ఉండదన్నారు. పాలమూరు జిల్లా రైతులకు నష్టం కలిగించే డిండి ప్రాజెక్టు ప నులను నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ వెంకట్రామయ్య శెట్టి, మున్సిపల్ చైర్మన్ పిండి జయరాముడు, మాజీ ఎంపీపీ సుదర్శన్గౌడ్, జోగుళాంబ ఆలయ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, పీఏసీసీఎస్ మాజీ చైర్మన్ మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.