గద్వాల, జనవరి 9: జోగుళాంబ గద్వాల జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్తో రక్తశుద్ధికి ఊరట లభించింది. తొమ్మిది మిషన్లద్వారా నిత్యం 45 మంది రోగులకు డయాలసిస్ చేస్తున్నారు. 106 మంది పేర్లు నమోదు చేసుకోగా, ఇప్పటివరకు 11,373 సార్లు రక్తశుద్ధి చేశారు. 24 గంటల పాటు స్థానికంగానే ఉచిత సేవలందుతుండడంతో దూర, వ్యయభారం తగ్గింది. ప్రతి వ్యక్తికి కొత్త ఫిల్టర్ను వినియోగిస్తున్నారు. జిల్లా కేంద్రానికి వచ్చే రోగులకు ఉచిత బస్పాస్తోపాటు పింఛన్ అందిస్తున్నది.
సీమాంధ్రపాలనలో వివక్షకు గురైన జిల్లా దవాఖానకు తెలంగాణ ఏర్పడిన తర్వాత మంచి రోజులు వచ్చాయి. జిల్లా దవాఖానకు ప్రభుత్వం సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుండడంతో వైద్యం కోసం ప్రభుత్వ దవాఖానకు రోగులు క్యూ కడుతున్నారు. దవాఖానకు వచ్చే పేదలకు మెరుగైనా వైద్యం అందుతుండడంతో ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఏ చిన్న సమస్య వచ్చినా రోగులను కర్నూల్కు తరలించే వారు. ప్రస్తుతం ఆ అవసరం లేకుండా జిల్లా కేంద్రంలోని దవాఖానకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించడంతో నడిగడ్డ ప్రజలు సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గతంలో ఏదైనా ప్రమాదం జరిగితే కర్నూల్, హైదరాబాద్కు వెల్లేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గద్వాల దవాఖానలోనే అన్ని వసతులు కల్పించారు. ఉమ్మడి జిల్లాకేంద్రాలకే పరిమితమైన డయాలసిస్ సెంటర్ను జోగుళాంబగద్వాల జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేశారు. గతంలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకోవాలంటే ఉమ్మడి జిల్లాకేంద్రం లేదా హైదరాబాద్, కర్నూల్ తదితర ప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకునేవారు.
అది వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. ప్రస్తుతం తెలంగాణ వైద్యారోగ్యశాఖ తీసుకున్న నిర్ణయంతో కిడ్నీ సంబంధిత బాధితులు డయాలసిస్ చేయించుకోవాలంటే ఇక దూరప్రాంతాలకు వెళ్లకుండా సర్కార్ దవాఖానల్లో ఉచితంగా డయాలసిస్ సేవలు అందుతున్నాయి. డయాలసిస్ కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 11,373మందికి డయాలసిస్ చేశారు. జిల్లాలోని మూత్రపిండ వ్యాధిగ్రస్తులు 106మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్తే ఒక్కసారి డయాలసిస్ చేయించుకోవాలంటే రూ.1500 నుంచి రూ.2వేల వరకు ఖర్చు అయ్యేది. కిడ్నీ సమస్య బాధితులు వారంలో రెండు, మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంది. అయితే ఇది పేదవారికి ఇబ్బందికరంగా ఉండేది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం జిల్లా దవాఖానల్లో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంలో రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా చికిత్స చేయనున్నారు. ప్రస్తుతం దవాఖానలో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్లో ప్రతి వ్యక్తికి కొత్త ఫిల్టర్ను వినియోగిస్తున్నారు. ఈ పద్ధతి ఉపయోగించడంలో దేశంలో తెలంగాణ మొదటిది. జిల్లాకేంద్రానికి డయాలసిస్ చేయించుకోవడానికి వచ్చే వారికి ప్రభుత్వం ఉచిత బస్పాస్ సౌకర్యం కల్పించింది. దీంతోపాటు వీరికి ప్రతి నెలా పింఛన్ అందించడంతోపాటు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నడిగడ్డ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మనసున్న మారాజు కేసీఆర్
ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల మా లాంటి పేదలకు మేలు జరుగుతుం ది. వారంలో మూడురోజులు వివిధ ప్రాంతాలకు వెళ్లి డయాలసిస్ చే యించుకునేవాళ్లం. అక్కడికి వెళ్లాలం టే ఖర్చుతో కూడుకున్నది. ఒక్కోసా రి డబ్బులు లేక వారంలో వెళ్లలేకపోయేవాళ్లం. స్థానికంగా డయాలసిస్ ఏర్పాటు చేయడం వల్ల ఖర్చు తగ్గింది. ప్రభు త్వ దవాఖానలో డయాలసిస్ ఏర్పాటు చేయడం వల్ల మా లాంటి పేదలకు మేలు జరుగుతుంది. సీఎం కేసీఆర్ మనసున్న మరాజు. దవాఖానలో ఎలాంటి ఖర్చులేకుండా డ యాలసిస్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రభుత్వమ ని నిరుపించుకున్నది. పింఛన్ కూడా మంజూరు చేశారు.
– మహేశ్వర్రెడ్డి, నక్కలపల్లి
నిత్యం 45మందికి..
జిల్లా దవాఖానలో తొమ్మిది మిషన్లతో నిత్యం 45మందికి డయాలసిస్ చేస్తున్నాం. రోజు రోజుకూ కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నది. మరికొన్ని మిషన్లు ఏర్పాటుచేస్తే అందరికీ డయాలసిస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రారంభం నాటినుంచి 11,373మందికి చేశాం. రోజూ ఐదు షిఫ్ట్ల్లో 24గంటలు డయాలసిస్ చేస్తున్నాం. ఒక వ్యక్తికి డయాలసిస్ చేయడానికి 150లీటర్ల నీరు అవసరమవుతుంది. ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులకూ అవరమైన వసతులు దవాఖానలో కల్పించింది. మందులకూ ఎలాంటి ఇబ్బంది లేదు. డయాలసిస్ వ్యాధిగ్రస్తులు వినియోగించుకోవాలి.
– కిశోర్కుమార్, డయాలసిస్ కేంద్రం ఇన్చార్జి