నారాయణపేట టౌన్, నవంబర్ 22 : జిల్లాలోని మక్త ల్, నారాయణపేట, కోస్గి మున్సిపాలిటీల్లో చేపడుతున్న అ భివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కా ర్యాలయంలో మున్సిపల్ అధికారులతో మంగళవారం స మీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా కేంద్రం తోపాటు కోస్గి పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో శానిటేషన్ విషయంలో అలసత్వం ప్రదర్శించరాదని, నిరంతరం చెత్త సేకరణ చేపట్టాలన్నారు.
మక్తల్ మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్త వే రు చేసి కృత్రిమ ఎరువులు తయారు చేయాలన్నారు. మిగిలిపోయిన మిషన్ భగీరథ పైప్లైన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని, మున్సిపాలిటీల్లో ధోబీఘాట్ల నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మ యాంక్ మిట్టల్, ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ విజయ్భాస్కర్, మున్సిపల్ కమిషనర్లు సునీత, మల్లికార్జున్, పూర్ణచందర్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
రీచ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
ఇసుక రీచ్లు ప్రారంభించిన చోట అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సీసీ కెమెరాలు, చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో ని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స మావేశంలో ఆయన మాట్లాడుతూ గృహ అవసరాల కోసం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మన ఇసుక వాహ నం https://tsmiv.cgg.gov.in/home వెబ్సైట్లో ప్రజలు ఇసుక కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించా రు.
మంగళవారం నుంచి లింగాల్చెడ్తో కోస్గి, మద్దూర్, దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, కోయిల్కొండ ప్రజలకు ట్రాక్టర్ల నుంచి ఇసుక చేరవేస్తామన్నారు. దూరాన్ని బ ట్టి ఇసుక ధరను నిర్ణయిస్తామన్నారు. నిర్దేశించిన సమయానికి ఇసుక అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు. దాసర్దొడ్డి, ఓబులాపూర్ గ్రామాల నుంచి జిల్లాకు 20 0 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికైనా ఇసుక తరలించేందుకు వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఏ డీ మైన్స్ విజయ్కుమార్, ఆర్టీవో వీరస్వామి, ప్రాజెక్ట్ మేనేజర్ రజిని తదతరులు పాల్గొన్నారు.