జడ్చర్ల, జనవరి 24 : వేరుశనగకు గిట్టుబాటు ధర లు రావడం లేదంటూ బుధవారం జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజుల వరకు వేరుశనగకు క్విం టా రూ.8,500పైగా ధర పలుకగా రెండు, మూడు రో జులుగా ధరలు తగ్గిస్తూ రూ.4 నుంచి రూ.6వేల వరకు వేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వేరుశనగకు మద్దతు ధర కల్పించి న్యాయం చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని, క్వింటాకు రూ.8,500 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. వారం రోజుల్లో రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ధరలు తగ్గించడం ఏంటని ప్రశ్నించారు. వ్యాపారులు, దళారులు కలిసి ధరలు తగ్గించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించా రు. వేరుశనగకు ధరలు తగ్గడంతో పెట్టుబడి కూడా రా వడం లేదని, మీరిచ్చే రేటుకు వేరుశనగను అమ్ముకుం టే మేమంతా అప్పులపాలు కావాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన చేస్తున్నారనే విష యం తెలుసుకున్న తాసీల్దార్ సత్యనారాయణరెడ్డి, కా ర్యదర్శి శ్రీనివాస్, ఎస్సై చంద్రమోహన్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ధరలు పెంచే వరకు ఆం దోళన విరమించేది లేదని వారు తేల్చి చెప్పడంతో అధికారులు వ్యాపారులతో సమావేశం నిర్వహించి ధరలు పెంచాలని సూచించారు.
వేరుశనగ సరుకులో మట్టితోపాటు తేమగా ఉందని అందు చేతనే ధరలు తగ్గాయని, అదేవిధంగా ఎక్స్పోర్టులో కూడా ధరలు తగ్గడం వల్ల ఇలా జరిగిందని వ్యాపారులు చెప్పారు. అయితే అధికారుల సూచన మేరకు రూ.5వేల లోపు ధరలు వచ్చిన వారికి క్వింటాకు రూ.200 అధికంగా ఇస్తామని తెలుపగా అందుకు రైతులు అంగీకరించలేదు. మార్కెట్కు వచ్చిన ప్రతి రైతుకూ ధర పెంచి ఇవ్వాలని వారు పట్టుబట్టారు. దాంతో అధికారులు వ్యాపారులతో మాట్లాడి గురువారం రీ టెండర్ వేయడానికి నిర్ణయించారు. దా నికి రైతులు కూడా ఒప్పుకోవడంతో గురువారం వేరుశనగకు రీ టెండర్ వేస్తారని తాసీల్దార్ సత్యనారాయణరెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. అయితే బుధవారం మార్కెట్కు దాదాపు 20 వేల బస్తాల (589 క్వింటాళ్లు) వేరుశనగ అమ్మకానికి వచ్చింది. మార్కెట్కు జడ్చర్ల చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు అధికశాతం కోస్గి, కొడంగల్, మద్దూర్, కర్ణాటక ప్రాంతాలకు చెందిన రైతులు వేరుశనగను తీసుకొచ్చారు. జడ్చర్లలో మంచి ధరలు వస్తాయని, తూకాల్లో కూడా మోసాలు లేవనే ఇంతదూరం వచ్చి వేరుశనగను అమ్ముకుంటు న్నామన్నారు. కానీ ఇక్కడికి వచ్చాక ధరలు తగ్గించడంతో రవాణా చార్జీలతోపాటు సాగు ఖర్చులు అధి కం కావడంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
క్వింటాకు రూ.8,500 ఇస్తే గిట్టుబాటవుతుందని వారు పేర్కొన్నారు. దాదాపు రెండు గంటలకు పైగా రైతులు ఆందోళన నిర్వహించారు.
వేరుశనగకు మద్ద తు ధర ఇవ్వాలి. వా రం రోజుల వరకు రూ.8 వేలకు పైగా ధర లు ఉన్న వేరుశనగకు ఒక్కసారిగా ధరలు త గ్గించారు. ధరలు తగ్గడంతో మాకు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. రేయనక పగలనక పొలాల వద్ద కాపుగాసి పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు రాకుంటే అప్పులపాలు కావాల్సిందే. అందుకే వేరుశనగకు రూ.8వేలకు పైగా మద్దతు ధర కల్పించాలి. నేను బుధవారం మార్కెట్కు 250 బస్తాల వేరుశనగ తీసుకొచ్చి రెండు కుప్పలు పోశాను. అందులో ఒక కుప్ప కు క్వింటా రూ.6,800 రాగా మరో కుప్పకు రూ. 6,300 వచ్చింది. ఒకే రైతుకు చెందిన వేరుశనగకు రెండు ధరలు రావడం ఏంటి? వ్యాపారులు కావాలనే ధరలు తగ్గించి టెండర్లు వేస్తున్నారు.
వేరుశనగకు ధరలు తగ్గాయని రైతులు ఆం దోళన చేశారు. వేరుశనగకు ధరలు పెంచి ఇ వ్వాలని రైతులు కోర గా వ్యాపారులతో ధర ల విషయంలో మా ట్లాడాం. వారు రూ. 5వేలలోపు టెండర్ వేసిన వాటికి క్వింటా కు రూ. 200 పెంచుతామని చెప్పారు. అందుకు రైతులు అంగీకరించకపోవడంతో గురువారం రీ టెండర్ వేయడానికి నిర్ణయించాం. జడ్చర్లతోపాటు ఇతర మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. రైతులు వేరుశనగను నాణ్యతగా తీసుకొస్తే మంచి ధరలు వస్తాయి. కానీ చాలామంది మట్టి, తేమ ఉన్నవాటిని తీసుకురావడంతో ధరలు తగ్గుతున్నాయి. బాగా ఆరబెట్టి చెత్తాచెదారం లేకుండా తీసుకువస్తే మంచి ధరలు లభిస్తాయి.