శ్రీశైలం, నవంబర్ 27 : శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో పుర వీధులన్నీ కిటకిటలాడాయి. కార్తీక మాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణతో మా ర్మోగింది. వరుసగా వారాంతపు సెలవులు, పౌర్ణమి, సోమవారం కలిసిరావడం తో భక్తులు కుటుంబసమేతంగా క్షేత్రానికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించుకొని మొ క్కులు తీర్చుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాధర మండపం, ఉత్తర మాడవీధి వద్ద దీపాలు వెలిగించుకొని పూజలు చేసుకొన్నారు. అనంతరం భక్తు లు స్వామిఅమ్మవార్ల దర్శనాలు ఉచిత దర్శనానికి 3గంటలు, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనానికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతుండగా సుమారు 60 వేల మందికి పైగా ఉభయ దేవాలయాల్లో దర్శానాలు చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం ఆలయ ప్రధాన ధ్వజస్తంభం వద్ద ఈవో పెద్దిరాజు దంపతుల ఆధ్వర్యంలో ఆకాశ దీప ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభపై ఆవిష్కరించారు.