పాలమూరు, జనవరి 1 : నూతన సంవత్సరా న్ని పురస్కరించుకొని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో అర్చకు లు స్వామివారికి విశేషపూజలు, అలంకరణ నిర్వహించి భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
అదేవిధంగా పట్టణంలోని లక్ష్మీనర్సింహస్వామి, వీరన్నపేటలోని పెద్ద శివాలయం, రేణుకాఎల్లమ్మ, అయ్యప్ప ఆలయాలను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకొని పూజ లు నిర్వహించారు. కార్యక్రమాల్లో మన్యంకొండ ఆలయ కమిటీ చైర్మన్, ధర్మకర్త అళహరి మధుసూదన్కుమార్తోపాటు వివిధ ఆలయాల చైర్మన్లు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.