జడ్చర్ల, నవంబర్ 17: తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు తర్వాత పోలేపల్లి గ్రామం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితోనే ఎంతో అభివృద్ధి చెందిందని పోలేపల్లి కాం గ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలిపారు. శుక్రవా రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన దాదాపు వంద మం ది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సర్పంచ్ చేతన్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షం లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్లో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా గౌరీశంకర్ కాలనీకి చెందిన మాజీ వార్డు మెంబర్ సువర్ణ, రవిప్రకాశ్, విఠల్గౌడ్లతోపాటు పలువురు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స మక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో జడ్చర్ల బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, కౌన్సిలర్ ఉమాశంకర్గౌడ్, రాంచంద్రారెడ్డి, ప్రభాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎ న్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. శుక్రవారం జడ్చర్ల మండలం బూర్గుపల్లి, కుర్వగడ్డపల్లి, అల్వాన్పల్లి, ఖానాపూర్, ఉదండాపూర్, గైరాన్తండా, గంగాపూర్ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేసి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్, ముడా డైరెక్టర్ ఇంతియాజ్ఖాన్, గిరియాదవ్, నర్సింహారెడ్డి, బృందంగోపాల్, ఉన్నారు.
బాలానగర్, నవంబర్ 17 : బీ ఆర్ఎస్ ప్రభుత్వం లో తండాలు అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ వర్కింగ్ మండలాధ్యక్షుడు బాలూనాయక్ అన్నారు. బోడజానంపేట, పలుగురాలకుంట, తిరుమలయ్యకుంటతండాల్లో బీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు బాలయ్యతో కలిసి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అని కొనియడారు. అనంతరం ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా మండలంలోని నేలబండతండా, పొలిమేరతండా, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి అరుణ్కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో రైతుబం ధు సమితి మండలాధ్యక్షుడు గోపాల్రెడ్డి, నాయకులు శ్రీనివాసులు, సాయిలు, రాజేందర్, శ్రీనివాస్రెడ్డి, నర్సింగ్ పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, నవంబర్ 17 : ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ సైన్యం ఇంటింటికి కదిలింది. శుక్రవారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఇం టింటి ప్రచారం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్ట ర్ లక్ష్మారెడ్డి కుమార్తె స్ఫూర్తిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరించారు. కారు గుర్తు కు ఓటు వేసి మరోసారి ఎమ్మెల్యేగా లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే పట్టణంలోని పాతబజార్లోని జామా మసీదు, అలీ మసీదు ప్రాంతాల్లో బీఆర్ఎస్ మైనార్టీ నా యకులు బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను అందజేస్తూ ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డికి మద్దతుగా జడ్చర్ల న్యాయవాదులు ప్రచారం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో న్యాయవాదులు ఇంటింటికీ తిరుగు తూ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి వివరించారు. అన్ని వర్గాలకు మే లు చేసే బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, న్యాయవాదులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మిడ్జిల్, నవంబర్ 17 : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గెలుపు కోసం అన్ని గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శుక్రవారం రాణిపేట, వెలుగొమ్ముల, అయ్యవారిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పత్రాలను ఇం టింటికి పంచుతూ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాణిపేటలో మహిళలతో కోలాటలతో ప్రజలను చైతన్యం చేశారు. ప్రతిఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నవాబ్పేట, నవంబర్ 17 : నవాబ్పేట మం డల కేంద్రంతోపాటు యన్మన్గండ్ల, సిద్దోటం, కాకర్జాలతండా, రుద్రారం గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మద్దతుగా శుక్రవా రం ఆ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నవాబ్పేట, నవంబర్ 17 : బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తనయుడు స్వరణ్రెడ్డి కోరారు. మండలంలోని కొల్లూరు, చౌడూర్, పోమాల, అమ్మాపూర్ గ్రామాల్లో మండల యూత్వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల యువకులు నిర్వహించిన భారీ ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. కష్టాలు కొనితెచ్చుకున్నట్లేనని పేర్కొన్నారు. యువ నాయకులంతా గ్రామాల్లో ప్రజలకు వద్దకు వెళ్లి కేసీఆర్ చేపడుతున్న పథకాలు వివరించాలన్నారు. లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందర్నాయక్, యూత్వింగ్ మండలాధ్యక్షుడు శ్రీను, యువనాయకులు రాజు, సేవ్యానాయక్, రఘుగౌడ్, నరేశ్, రమేశ్ పాల్గొన్నారు.