మక్తల్ టౌన్, నవంబర్ 9: తెలంగాణ ప్రజలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్రెడ్డి తెలంగాణ ప్రజలను మో సం చేసేందుకు కల్లబొల్లి మాటలు చెబుతూ జిమ్మికులు చేస్తున్నారని అన్నారు. పక రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను అక్కడి ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే నాలుగు నెలల్లోనే వారు ముప్పు తిప్పలు పడుతు న్నారన్నారు. అవే గ్యారెంటీలను తెలంగాణలో అమలు చేస్తామని హామీలిస్తున్నారన్నారు. ఆరు గ్యారెంటీలను నమ్మి ఓటేస్తే తెలంగాణ ప్రజలకు సైతం కర్ణాటక ప్రజలు ఎదురొంటున్న కష్టాలు తప్పవన్నారు. ఆంధ్ర వలస పాలకుల చేతుల్లో అన్యాయానికి గురైన తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏరాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకలను అమలు చేసి పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే అది బీఆర్ఎస్తోనే సాధ్యమౌతుందన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలు అందాలంటే ఈనెల 30న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒకరూ కారు గుర్తుపై ఓటేసి కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా సభ్యురాలు చిట్టెం సుచరితారెడ్డి, ఎంపీపీ వనజమ్మ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైపాల్రెడ్డి, రవికుమార్ యాదవ్, రమేశ్ ముదిరాజ్, ఎల్లారెడ్డి , విజయ్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఆశిరెడ్డి, అరవింద్, సర్పంచులు దత్తప్ప, ప్రతాపరెడ్డి, సూర్యప్రకాశ్రెడ్డి, నాయకులు జయానంద రెడ్డి, రవీందర్ రెడ్డి, చిన్న హనుమంతు, అన్వర్ హుస్సేన్, ఈశ్వర్ యాదవ్, నేతాజీ సాగర్, కృష్ణ, ఆయా మండలాల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఊట్కూర్, నవంబర్ 9: మండలంలోని ఓబ్లాపూర్ గ్రా మానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు గురువారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే చిట్టెం గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభి వృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లు వేయించి తనను తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రజల ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, సర్పంచుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు సూర్యప్రకాశ్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.