నవాబ్పేట, ఫిబ్రవరి 15 : గిరిజనుల ఆరాధ్యదైవమైన సేవాలాల్ మహరాజ్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగించాలని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఊరంచుతండాలో గురువారం సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతిని నిర్వహించారు. భోగ్ బండార్లో ఎంపీ మన్నె పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు సంచార జాతులుగా మ నుగడ సాగిస్తున్న కాలంలో వారిని ఏకం చేసి చై తన్య పరిచారన్నారు. నవాబ్పేట మండలంలో సే వాలాల్ ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిందన్నారు. ఏండ్లుగా అభివృద్ధికి ఆ మడదూరంలో ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో ప్రగతి సాధించేలా కృషి చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సిములు, వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, యువనాయకుడు అభిమన్యురెడ్డి, సేవాలాల్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు లింబ్యానాయక్, ఉత్సవ కమిటీ సభ్యులు చందర్నాయక్, శంకర్నాయక్, రాములునాయక్, నర్సింహానాయక్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.