మాగనూర్, డిసెంబర్ 3 : తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే అది టీఆర్ఎస్ పార్టీ హయాంలోనే సాధ్యమని ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని వడ్వాట్లో మిషన్ భగీరథ, పల్లె దవాఖానను ఎమ్మెల్యే జి ల్లా వైద్యాధికారి డీఎంహెచ్వో రామ్మనోహర్రావు కలిసి ప్రారంభించారు. పల్లె దవాఖానలో డీఎంహెచ్వో ఎమ్మెల్యే బరువు, బీపీ, షుగర్ చెక్ చేశారు. గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రోడ్లు, మిషన్ భగీరథ, పల్లె దవాఖాన, వైకుంఠధామాలు, పల్లె ప్రాంగణాలు, క్రీడా ప్రాంగణాలు, రైతు వేదిక, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర ఎన్నో సంక్షేమ పథకాలతో రాష్ట్రం నెంబర్ వన్ గా అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు.
అనంతరం అమ్మపల్లిలో క్రీడాప్రాంగాణం, మిషన్ భగీరథ వాటర్ ట్యాంకర్ ప్రారంభించారు. గ్రామానికి రోడ్డు వచ్చేలా సహకారించాలని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం తో అందుకు సానుకూలంగా స్పందించారు. యువకులకు సర్పంచ్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు ఎమ్మెల్యే పంపిణీ చే శారు. క్రీడా ప్రాంగణంలో యువకులకు కబడ్డీ పోటీలు ని ర్వహించి ప్రతిభ కనబర్చిన యువకులను అభినందించా రు. కార్యక్రమలో జెడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీపీ శ్యామల మ్మ, సర్పంచ్ నర్సింహులు, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, ఎంపీడీ వో సుధాకర్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ, డిసెంబర్ 3 : మండలంలోని గుడెబల్లూర్ గ్రామానికి చెందిన కుర్వ సాబులు, మల్లమ్మ కూతురు కుర్వ సునీ త నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఎంబీబీఎస్ సీట్ సాధించడంపై ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, టీఆర్ఎస్ మండల నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు మేరి మెమోరియల్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సునీతను శనివారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ మహదేవమ్మ, ఎంపీటీసీలు వెంకటేశ్, లక్ష్మి, నా రాయణ, టీఆర్ఎస్ మండల యువ నాయకుడు శివరాజ్పాటిల్, అఖిలపక్ష నాయకులు, ప్రధానోపాధ్యాయుడు వెం కటేశ్ తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, డిసెంబర్ 3 : ఉమ్మడి జిల్లా కేంద్రంలో నిర్వహించే సీఎం సభకు మక్తల్ నియోజకవర్గ నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు అధికసంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో నూతన కలెక్టరేట్ సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఆదివారం వస్తున్నారన్నారు. సీఎం సభకు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.