భూత్పూర్: నియోజకవర్గంలోని దేవరకద్ర మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి కూతురు భవానీ అనా రోగ్యంతో హైద్రాబాద్ దవాఖానకు వెళ్లగా ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు. కాగా ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి ఆర్థిక స్థోమత లేదని సర్జరీ కోసం ఎవరైనా సాయం అందించాలని కొరుతూ భవానీ కుటుంబీకులు వాట్సప్లో పోస్టు పెట్టారు.
దీనికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆదివారం నేరుగా భవానీ కుటుంబీకులకే ఫోన్ చేసి అన్నా సాగర్కు పిలుపించుకొని అమ్మాయిని చూసి వారి ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సర్జరీకి అవసరమైన ఆర్థి క సాయం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
అంతేకాకుండా ఇల్లు లేదని చెప్పడంతో గ్రామంలో డబుల్బెడ్ రూం ఇల్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చా రు. వాట్సాప్కు మెసేజ్కు ఎమ్మెల్యే స్పందించి సాయం అందిస్తాననడం మాకు నమ్మశక్యంగా లేదని భాగ్యలక్ష్మి అన్నా రు. ఆలవెంకటేశ్వర్రెడ్డి ఎమ్మెల్యే కాదు మా పాలిట దేవుడని కృతజ్ఞతలు తెలిపారు.
పోతుగుట్టతాండా రోడ్డు మరమ్మతుకు రూ.5లక్షలు మంజూరు
మండలంలోని హస్నాపూర్ గ్రామ పరిధిలోని పోతుగుట్ట తాండాకు రోడ్డు లేక తీవ్ర ఇబ్బందుఎలను ఎదుర్కొంటున్నట్లు తండావాసులు తెలపడంతో సోమవారం ఎమ్మెల్యే స్పందించి రూ.రోడ్డు మరమ్మతుకు రూ.5లక్షలు మంజూరు చేస్తున్న ట్లు ఎమ్మెల్యే తెలిపారు. వెంటనే పీఆర్ఏఈతో ఎమ్మెల్యే మాట్లాడి రోడ్డు పరిస్థితులను పరిశీలించమని ఆదేశించారు. కార్య క్రమంలో ఉప సర్పంచ్ నర్సిరెడ్డి, తాండావాసులు రవినాయక్, రాములు తదితరులు పాల్గొన్నారు.