చారకొండ, ఫిబ్రవరి 8: జడ్చర్ల-కోదాడ జా తీయ రహదారిలో చారకొండ వద్ద చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చారకొండ గ్రామస్తులు గురువారం రాస్తారో కో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు మూలమలుపులు ఉన్నాయనే సాకు తో చారకొండలో బైపాస్ రోడ్డు నిర్మించడం వల్ల నిరుపేదలకు చెందిన ఇండ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. ఉన్న రోడ్డునే విస్తరిస్తే ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని, ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మల్లేపల్లి-కల్వకు ర్తి వరకు మలుపులు ఉన్నాయనే సాకుతో రోడ్డును విస్తరించి..
చారకొండలో మాత్రం బైపాస్ నిర్మాణం చేపట్టడం ఎంత వరకు సమంజసం అని ప్ర శ్నించారు. ఇప్పటికైనా జాతీయ రహదారి ఉన్నాతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బైపాస్ పనులు వెంటనే నిలిపి వేసి ఉన్న రోడ్డునే విస్తరించి న్యాయం చేయాలని కోరారు. విషయం తెలుసుకు న్న ఎస్సై రాజశేఖర్ అక్కడికి చేరుకొని జిల్లా అధికారులతో మాట్లాడిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో నాయకులు బా ల్రాంగౌడ్, శంకర్గౌడ్, గణేశ్, వెంకటయ్యగౌడ్, లక్ష్మయ్యగౌడ్, సత్యం, విష్ణు, సత్తార్, శ్రీను, శివ, గిరిజ, రమేశ్, అశోక్, సుదర్శన్ పాల్గొన్నారు.